మోచా బీభత్సం.. మయన్మార్‌ లో ముగ్గురు మృతి.. రఖైన్ ను తాకిన తరువాత బలహీన పడిన సైక్లోన్..

By Asianet NewsFirst Published May 15, 2023, 10:06 AM IST
Highlights

మోచా సైక్లోన్ బంగ్లాదేశ్, మయన్మార్ లోని అనేక ప్రాంతాలను అతలాకుతలం చేసింది. ఈ తుఫాను వల్ల చాలా ప్రాంతాల్లో నీళ్లు నిండాయి. ముగ్గురు మరణించారు. అయితే ఈ సైక్లోన్ రఖైన్ ను తాకిన తరువాత బలహీన పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

బంగాళాఖాతంలో 1982 తర్వాత ఏర్పడిన రెండో అత్యంత తీవ్రమైన తుపానుగా పేరొందిన మోచా తుఫాను ఆదివారం మధ్యాహ్నం బంగ్లాదేశ్, మయన్మార్ లోని రఖైన్ రాష్ట్రాల్లో సిట్వే టౌన్ షిప్ సమీపంలో తీరం దాటింది. మయన్మార్ లో మోచా తుపాను బీభత్సం సృష్టించింది. అక్కడి భవనాల పైకప్పులు విరిగిపడి ముగ్గురు మృతి చెందారు.  వీధుల నిండా నీళ్లు నిండాయి. చెట్లు నేలకూలాయి. మయన్మార్ ఓడరేవు నగరమైన సిట్వే నీటితో మునిగిపోయింది. 

ఫిట్టింగ్ సూట్, సన్ గ్లాసెస్ తో కొత్త లుక్ లో జైశంకర్.. ఫొటో వైరల్.. హాలీవుడ్ స్టార్ లా ఉన్నారంటూ కామెంట్లు

అయితే మోచా తుపాను బలహీనపడి మయన్మార్ మీదుగా తుఫానుగా మారిందని వాతావరణ శాఖ తన తాజా బులెటిన్లో పేర్కొంది. కాగా.. మయన్మార్ తీరాన్ని తాకిన శక్తివంతమైన తుఫాను నుంచి ఆశ్రయం పొందేందుకు వేలాది మందిని మయన్మార్ లోని మఠాలు, పగోడాలు, పాఠశాలలకు తరలించారు. దాదాపు రెండు దశాబ్దాల్లో బంగ్లాదేశ్ లో కనిపించిన అత్యంత శక్తివంతమైన తుఫాను మోచా అని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ కు అలర్ట్ ప్రకటించామని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వివిధ తీర ప్రాంతాల్లో మోహరించామని తెలిపారు.

స్విటేలో వరదలు..
మోచా తుఫాను వల్ల మయన్మార్ అతలాకుతలమైంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ప్రజలు తమ ఇళ్లలోని లోతట్టు ప్రాంతాలలో చిక్కుకున్నారు. ఈ తుఫాను కారణంగా మయన్మార్ లోని రఖైన్ రాష్ట్ర రాజధాని సిట్వేలో కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి. నగరంలోని కొన్ని ప్రాంతాలు గంటకు 130 మైళ్ల వేగంతో వీచాయి.

కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్..? అర్ధరాత్రి వరకు సాగిన సీఎల్పీ సమావేశం..

మయన్మార్ లోని సిట్వే ప్రాంతంలో భారీ వర్షాలు, వరదల కారణంగా విద్యుత్, వైఫై కనెక్షన్లకు అంతరాయం కలిగింది. అలలు విపరీతంగా పెరిగి వరద వీధుల్లోకి శిథిలాలను తీసుకొచ్చాయి. తుఫాను సమీపిస్తుండగా ఈదురుగాలుల ధాటికి టెలికాం టవర్ కూలిపోయింది. యాంగూన్ లో కురుస్తున్న వర్షాలకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడం, భవనాలపై నుంచి హోర్డింగ్ లు ఎగురుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Storm surges whipped up by a powerful cyclone moving inland from the Bay of Bengal inundated the Myanmar port city of Sittwe https://t.co/YG8TOBMG0X pic.twitter.com/li37p4HiRa

— Reuters (@Reuters)

తుపాను ప్రభావిత ప్రాంతానికి ఆహారం, మందులు, సహాయం, వైద్య సిబ్బందిని పంపడానికి సైనిక ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని మయన్మార్ లోని స్థానిక మీడియా నివేదించింది. రఖైన్ ను తాకిన తర్వాత తుఫాను బలహీనపడిందని, వాయువ్య రాష్ట్రమైన చిన్, మధ్య ప్రాంతాలను సోమవారం తాకే అవకాశం ఉందని ‘ఏపీ’ తెలిపింది. కాగా.. కొండచరియలు విరిగిపడటంతో సమాధి అయిన దంపతుల మృతదేహాలను వెలికితీశామని దేశంలోని తూర్పు షాన్ రాష్ట్రంలోని రెస్క్యూ టీం పేర్కొంది. పైన్ ఓ ల్విన్ టౌన్ షిప్ లో మర్రిచెట్టు కూలి ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది.

మోచా తుఫాను కారణంగా బంగ్లాదేశ్ లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీయడంతో ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థుల శిబిరమైన కాక్స్ బజార్ లోని 1,300 వెదురు షెల్టర్లు ధ్వంసమయ్యాయి. తుఫాను తీరం దాటడానికి ముందు, కాక్స్ బజార్ లోని సుమారు 300,000 మందిని రోహింగ్యా శరణార్థులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు దుర్మరణం

ఇదిలా ఉండగా.. ఈ తుఫాన్ భయాందోళనల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ లోని సీ రిసార్ట్ పట్టణాలపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫోర్స్ సిబ్బంది నిఘా ఉంచి ఆదివారం బీచ్ కు వెళ్లకుండా పర్యాటకులను అడ్డుకుంటున్నారు. పుర్బా మేదినీపూర్ జిల్లాలోని దిఘా, మందర్మణి, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోని బఖాలీ, సుందర్బన్స్ తీర ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ దళ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో రెండు జిల్లాల్లోని తీరప్రాంత వాసులను ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లు చేశారు.

click me!