కరోనాపై పైలట్ ముచ్చట్ల వల్లే పాక్ విమాన ప్రమాదం: 97 మంది మృతి బలి

Siva Kodati |  
Published : Jun 24, 2020, 04:51 PM ISTUpdated : Jun 24, 2020, 04:54 PM IST
కరోనాపై పైలట్ ముచ్చట్ల వల్లే పాక్ విమాన ప్రమాదం: 97 మంది మృతి బలి

సారాంశం

పాకిస్తాన్ విమానయాన చరిత్రలోనే ఘోర దుర్ఘటనగా అభివర్ణించిన కరాచీ విమాన ప్రమాదానికి సంబంధించి అసలు కారణం వెలుగు చూసింది. ఈ విషాదానికి మానవ తప్పిదమే కారణమని దర్యాప్తు బృందం తేల్చింది.

పాకిస్తాన్ విమానయాన చరిత్రలోనే ఘోర దుర్ఘటనగా అభివర్ణించిన కరాచీ విమాన ప్రమాదానికి సంబంధించి అసలు కారణం వెలుగు చూసింది. ఈ విషాదానికి మానవ తప్పిదమే కారణమని దర్యాప్తు బృందం తేల్చింది.

పైలట్ నిర్లక్ష్యం కారణంగా ఈ ఘోరం జరిగిందని వెల్లడించింది. మే 22న 99 ప్రయాణికులతో లాహోర్ నుంచి బయల్దేరిన ఎయిర్‌బస్ ఎ320 విమానాన్ని కరాచీ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసే సమయంలో పైలట్, ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యహరించినట్లు దర్యాప్తు బృందం తెలిపింది.

Also Read:97 మందిని పొట్టనబెట్టుకున్న విషాదం: కరాచీ విమానం కూలడానికి ముందు..జరిగింది ఇదీ

వీరు ఏ మాత్రం పట్టకుండా కరోనా వైరస్ గురించి మాట్లాడుకున్నట్లు పాకిస్తాన్ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వర్ ఖాన్.. ఆ దేశ పార్లమెంట్‌లో బుధవారం ప్రకటించారు. పైలట్, ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ మాటల్లోపడి విమానం ల్యాండింగ్‌పై దృష్టి పెట్టలేదు.

కరోనా గురించి వీరంతా చర్చల్లో మునిగి తేలుతున్నారని ఆయన చెప్పారు. కాగా ఈ ఘోర దుర్ఘటనలో 97 మంది దుర్మరణం పాలవ్వగా.. కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ ప్రమాదంపై పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు బృందంలో ఏవియేషన్ నిపుణులతో పాటు ఫ్రాన్స్‌కు చెందిన నిపుణులు కూడా ఉన్నారు. వీరు విమానానికి సంబంధించిన వాయిస్ రికార్డులు, డేటాను విశ్లేషించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. 

PREV
click me!

Recommended Stories

ఇరాన్ పై యూఎస్, ఇజ్రాయెల్ దాడులు.. ఇండియాలో హైఅలర్ట్
Iran Israel war: ప్ర‌పంచం ఎప్పుడూ చూడని దాడులు చేస్తాం.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్