మసూద్‌ మా దేశంలోనే ఉన్నాడు: అంగీకరించిన పాక్

Siva Kodati |  
Published : Mar 01, 2019, 10:11 AM ISTUpdated : Mar 01, 2019, 10:14 AM IST
మసూద్‌ మా దేశంలోనే ఉన్నాడు: అంగీకరించిన పాక్

సారాంశం

ప్రస్తుతం భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలతో పాటు... ఉగ్రవాదులకు సాయాన్ని నిలిపివేయాలని, ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేయాలని అంతర్జాతీయ సమాజాం నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఆ దేశం నష్టనివారణ చర్యలు చేపడుతోంది.

ప్రస్తుతం భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలతో పాటు... ఉగ్రవాదులకు సాయాన్ని నిలిపివేయాలని, ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేయాలని అంతర్జాతీయ సమాజాం నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఆ దేశం నష్టనివారణ చర్యలు చేపడుతోంది.

దీనిలో భాగంగా పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్‌ తమ దేశంలోనే ఉన్నాడని పాకిస్తాన్ ప్రకటించింది. ప్రస్తుతం మసూద్ ఆరోగ్యం బాలేదని పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి తెలిపారు.

అతను ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితుల్లో లేడని ఆయన వెల్లడించారు. మసూద్‌కు వ్యతిరేకంగా భారత్ సాక్ష్యాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని ఖురేషి స్పష్టం చేశారు. అయితే మా దేశ న్యాయస్థానాలు ఆమోదించేలా సాక్ష్యాధారాలు ఉండాలన్నారు. 

PREV
click me!

Recommended Stories

Train Rules: టికెట్ లేకుండా రైలు ప్ర‌యాణం చేస్తే.. పాకిస్థాన్‌లో ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా.?
IMF: ప్ర‌పంచ దేశాల‌కు ఐఎమ్ఎఫ్ రుణాలు ఇస్తుంది స‌రే.. ఇంత‌కీ IMFకి డ‌బ్బులు ఎక్క‌డివి