ఇండోనేషియాలో భూకంపం: 82 మంది మృతి

Published : Aug 06, 2018, 07:30 AM IST
ఇండోనేషియాలో భూకంపం: 82 మంది మృతి

సారాంశం

ఇండోనేషియాను భారీ భూకంపం తాకింది. లాంబాక్‌ ద్వీపంలో 7 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దాని వల్ల 82 మంది మరణించారు. చాలా భవనాలు ధ్వంసమయ్యాయి.

జకార్తా: ఇండోనేషియాను భారీ భూకంపం తాకింది. లాంబాక్‌ ద్వీపంలో 7 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దాని వల్ల 82 మంది మరణించారు. చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. 

భూకంపం15 కి.మీ లోతులో కేంద్రీకృతమైనట్లు అమెరికా జియలాజికల్‌ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం తర్వాత రెండు సార్లు కాస్తా తక్కవ స్థాయిలో భూకంపాలు వచ్చాయి. దాదాపు 25 ప్రకంపనలు వచ్చాయి. అధికారులు తొలుత సునామీ హెచ్చరిక జారీ చేసి, ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. 

ఈ భూకంపం తీవ్రతకు దాదాపు 900 కి.మీ దూరంలోని బాండుంగ్‌ నగరంలోనూ నష్టం వాటిల్లింది. బాలి ద్వీపంలో భూకంపం తీవ్రత ఎక్కువగా కనిపించింది. వారం రోజుల క్రితమే లాంబాక్‌లో 6.4 తీవ్రతతో భూకంపం వచ్చి 17 మంది మరణించారు. వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి.

PREV
click me!

Recommended Stories

భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందని.. రూ.6 కోట్ల శాలరీ జాబ్ వదులుకున్న భర్త.. కోర్టు ఆసక్తికర తీర్పు
SuperShe Island : పురుషులకు బ్యాన్.. ఆ ఐలాండ్ రూల్స్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !