Singapore: అలా చేశాడ‌ని.. సింగ‌పూర్ లో భారతీయ సంతతి యువ‌కుడికి భారీ జ‌రిమానా.. ఏం జ‌రిగిందంటే..?

Published : Jun 01, 2022, 02:35 PM IST
Singapore: అలా చేశాడ‌ని.. సింగ‌పూర్ లో భారతీయ సంతతి యువ‌కుడికి భారీ జ‌రిమానా.. ఏం జ‌రిగిందంటే..?

సారాంశం

Singapore: సింగపూర్‌లో కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించాడ‌ని  భారతీయ సంతతి యువకుడికి భారీ జరిమానా విధించారు. క‌రోనా నిబంధనలను ఉల్లంఘించి.. నూత‌న‌ సంవత్సర వేడుకల్లో పాల్గొన్నడ‌ని భారత సంతితికి చెందిన కోట్రా వెంకట సాయి రోహన్​కృష్ణ అనే  యువకుడికి 4,000 సింగపూర్ డాలర్ల జరిమానా విధించబడింది సింగపూర్​ కోర్టు.   

Singapore: సింగపూర్‌లోని 19 ఏళ్ల భారతీయ సంతతి చెందిన‌ యువకుడికి అక్క‌డి ప్ర‌భుత్వం భారీ మొత్తంలో జ‌రిమానా విధించింది. ఆ యువ‌కుడికి దాదాపు 4,000 సింగపూర్ డాలర్ల జరిమానా విధించబడింది సింగ‌పూర్ కోర్టు. అస‌లేం జ‌రిగింది..? అంత మొత్తంలో ఎందుకు జ‌రిమానా విధించార‌ని  ఆలోచిస్తున్నారా..? అయితే.. ఈ క‌థ‌నం చదవాల్సిందే.. 

 సింగ‌పూర్ స్థానిక మీడియా అందించిన స‌మాచారం ప్ర‌కారం.. గత  ఏడాది భార‌త సంత‌తి చెందిన  కోట్రా వెంకట సాయి రోహన్‌కృష్ణ, అతని ముగ్గురు స్నేహితులతో క‌లిసి నూతన సంవత్సర వేడుక‌ల్లో పాల్గోన్నారు. అయితే.. సింగ‌పూర్ లో ఈ స‌మ‌యంలో క‌రోనా నిబంధ‌న‌ల‌కు క‌ఠినంగా అమ‌లు చేస్తుంది. అయినా.. వెంకట సాయి క‌రోనా నిబంధ‌న‌ల‌ను లెక్క చేయ‌కుండా... అతిక్ర‌మిస్తూ.. ఆ పార్టీకి స్పైడర్‌మ్యాన్ దుస్తులలో వెళ్లాడు. ఈ స‌మ‌యంలో అనేకమార్లు COVID-19 నిబంధనలు ఉల్లంఘించారు 

ఇదిలా ఉంటే.. అతను, అతని ముగ్గురు స్నేహితులు క‌లిసి ఓ యూట్యూబ్ ఛానెల్‌లో న‌డుపుతున్నారు. ఈ వేడుకు సంబంధించిన వీడియోను కొన్ని రోజుల తర్వాత ఆ ఛానెల్ లో అప్లోడ్​ చేశారు. దీంతో  ఈ విషయం బయటపడింది. ఆ వీడియో 4నిమిషాలు 22సెకన్ల నిడివి  ఉంది.

ఆ వీడియోను ప‌రిశీలిస్తే.. .కోట్రా వెంకట సాయి.. కావాలనే..  కొవిడ్​ నిబంధనలను ఉల్లంఘించినట్టు తెలుస్తోంది. క‌నీసం అతను ఫేస్​ మాస్క్​ పెట్టుకోకుండానే.. పార్టీలో తిరగటం ఆ వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ వీడియాను త‌న‌ యూట్యూబ్​ ఛానెల్​లో పెట్టడంపై కూడా.. నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. వెంకట సాయి.. గుంపులో కలిసి ఉండగా.. ఆ దృశ్యాలను అతని స్నేహితులు చిత్రీకరించారు.

సింగ‌పూర్ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. COVID-19 నిబంధనలను ఉల్లంఘించి.. ఎవరైనా దోషిగా తేలితే  వారికి 10,000 సింగపూర్ డాలర్ల వరకు జరిమానా,  ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా ఒక్కో సారి ఆ  రెండు కూడా విధించబడతాయి. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన కోర్టు.. వెంకట సాయిని దోషి తేల్చింది. 4వేల సింగపూర్​ డాలర్ల జరిమానా విధించింది.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే