ఆర్ధిక శాస్త్రంలో భారతీయుడికి నోబెల్: అభిజిత్ బెనర్జీ‌ని వరించిన పురస్కారం

By Siva KodatiFirst Published Oct 14, 2019, 3:45 PM IST
Highlights

ఆర్ధిక శాస్త్రంలో భారతీయుడికి మరోసారి ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం లభించింది. భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో‌, మైఖేల్ క్రెమర్‌లను ఈ ఏడాది నోబెల్ కమిటీ ఎంపిక చేసింది

ఆర్ధిక శాస్త్రంలో భారతీయుడికి మరోసారి ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం లభించింది. భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో‌, మైఖేల్ క్రెమర్‌లను ఈ ఏడాది నోబెల్ కమిటీ ఎంపిక చేసింది.

కోల్‌కతాలో జన్మించిన ఆయన అంతర్జాతీయంగా పేదరికాన్ని ఎదుర్కొనే అంశంలో పరిష్కారాలు చూపినందుకు గాను బెనర్జీకి ఈ పురస్కారం దక్కింది. భార్య ఎస్తర్ డఫ్లో, మైఖేల్ క్రెమర్‌తో కలిసి అభిజిత్ త్వరలో నోబెల్ పురస్కారాన్ని అందుకోనున్నారు. 

BREAKING NEWS:
The 2019 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel has been awarded to Abhijit Banerjee, Esther Duflo and Michael Kremer “for their experimental approach to alleviating global poverty.” pic.twitter.com/SuJfPoRe2N

— The Nobel Prize (@NobelPrize)
click me!