డేంజర్ బెల్స్: యూకేలో ఒమిక్రాన్‌తో తొలి మరణం.. ధృవీకరించిన బ్రిటన్

Published : Dec 13, 2021, 05:36 PM ISTUpdated : Dec 13, 2021, 06:27 PM IST
డేంజర్ బెల్స్: యూకేలో ఒమిక్రాన్‌తో తొలి మరణం.. ధృవీకరించిన బ్రిటన్

సారాంశం

ఒమిక్రాన్ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. యూకేలో ఒమిక్రాన్‌ వైరస్ కారణంగా ఒకరు మరణించినట్టుగా బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.  ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా పలు దేశాలు ట్రావెల్ బ్యాన్ ను విధించాయి.

లండన్: కరోనా ఒమిక్రాన్ వేరియంట్‌తో తొలి మరణం చోటు చేసుకొంది. యూకేలో Omicron తో  ఒకరు మరణించినట్టుగా బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని  Boris Johnson  ఈ విషయాన్ని ప్రకటించారుపశ్చిమ లండన్‌లోని పాడింగ్‌టన్‌లోని వ్యాక్సిన్ సెంటర్ ను సందర్శించిన సందర్శంగా ప్రధాని  బోరిస్ జాన్సన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్నిజాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రెండు Corona vaccine డోసులను తీసుకొన్న వారంతా కూడా బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ను వేసుకోవాలని ఆయన కోరారు.

also read:Omicron: ఒమిక్రాన్ టీకా సామ‌ర్థ్యం త‌గ్గిస్తోంది.. వేగంగా వ్యాపిస్తోంది.. WHO హెచ్చ‌రిక‌లు

ఇంగ్టాండ్ లోని  వయస్సులో పెద్దవాళ్లంతా బూస్టర్ డోసును వేసుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోరారు. ఈ నెలాఖరులోపుగా బూస్టర్ డోస్ ను అందించాలని బ్రిటన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.  England లోని ఆసుపత్రుల్లో 10 మంది కరోనా ఒమిక్రాన్ వైరస్ సోకిన రోగులు చికిత్స పొందుతున్నారని ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ సోమవారం నాడు చెప్పారు.Booster డోస్  కరోనా ఒమిక్రాన్ వేరియంట్ నుండి 70 నుండి 75 శాతం వరకు రక్షణ కల్పిస్తోందని UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అభిప్రాయపడింది. లక్ష మందికి పై ప్రజలు బూస్టర్ ను బుక్ చేసుకోవడానికి ప్రయత్నించడంతో సోమవారం నాడు NHS వెబ్‌సైట్  క్రాష్ అయిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి..బూస్టర్ డోస్ కోసం ప్రజలు వ్యాక్సిన్ సెంటర్ల వద్ద క్యూ కట్టారు. 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ఆన్‌లైన్ లో బూస్టర్ డోసులు వేసుకొనేందుకు బుకింగ్ చేసుకోనేందుకు బ్రిటన్ సర్కార్ అవకాశం కల్పించింది.18 ఏళ్లు నిండిన వారు కూడా తమ రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తైతే బూస్టర్ డోస్ ను తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.

యూకేలో కరోనా ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రతి రెండు మూడు రోజులకు కేసులు రెట్టింపు అవుతున్నాయి. యూకే కరోనా నాలుగో స్థాయికి చేరుకొందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మే తర్వాత ఒమిక్రాన్ కారణంగా కరోనా కేసుల వ్యాప్తి మరింత పెరుగుతుందని అధికారులు అనుమానిస్తున్నారు.శనివారం నాడు నుండి యూకేలో అర మిలియన్ బూస్టర్ డోసులు అందించినట్టుగా అధికారులు ప్రకటించారు.యూకేలో కరోనా కేసుల పెరుగుదల ఒమిక్రాన్ ప్రధాన కారణమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు.  రానున్న రోజుల్లో ఆసుపత్రుల్లో రోగులతో నిండకుండా ఉండాలంటే ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని బోరిస్ జాన్సన్ తన టెలివిజన్ ప్రసంగంలో ప్రజలను కోరారు.యూకేలో కరోనా కేసుల పెరుగుదల ఒమిక్రాన్ ప్రధాన కారణమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు.  రానున్న రోజుల్లో ఆసుపత్రుల్లో రోగులతో నిండకుండా ఉండాలంటే ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని బోరిస్ జాన్సన్ తన టెలివిజన్ ప్రసంగంలో ప్రజలను కోరారు. యూకేలో 1239 కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. 12 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు వారిలో 81 శాతం మంది వ్యాక్సిన్ వేసుకొన్నారు. అంటే 46.7 మిలియన్ల మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొన్నారు.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?