పపువా న్యూగినియాలో భూకంపం, 7.2 తీవ్రత

Siva Kodati |  
Published : May 07, 2019, 07:23 AM IST
పపువా న్యూగినియాలో భూకంపం, 7.2 తీవ్రత

సారాంశం

పపువా న్యూగినియాలో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది

పపువా న్యూగినియాలో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది. బులాలో నగరానికి 33 కిలోమీటర్లు, దేశ రాజధాని పోర్ట్ మోర్స్‌బైకి 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. గాఢనిద్రలో ఉన్న ప్రజలు ఇళ్లలోని వస్తువులు కదిలినట్లుగా అనిపించడంతో ప్రాణభయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. 

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ