అత్యాచారానికి పాల్పడితే బహిరంగ ఉరి.. పార్లమెంట్లో సంచలన బిల్లు

By telugu teamFirst Published Feb 8, 2020, 11:28 AM IST
Highlights

 దేశంలో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించడానికే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టామని ఆ దేశ  పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అలీ మహమ్మద్ ఖాన్ తెలిపారు. ఈ తీర్మానాన్ని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ వ్యతిరేకించగా.. మిగతా అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో మెజార్టీ ఓట్లతో పార్లమెంట్‌లో బిల్లు పాస్ అయింది.
 

చిన్నారులపై లైంగిక దాడులు, హత్యలకు పాల్పడేవారిని బహిరంగంగా ఉరితీయాలని శుక్రవారం పార్లమెంట్ ఆమెదించింది. అబ్బ.. ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారు.. అని సంబరపడిపోకండి. ఎందకంటే ఈ నిర్ణయం తీసుకుంది మనదేశంలో కాదు.. పాకిస్తాన్ లో.

 దేశంలో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించడానికే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టామని ఆ దేశ  పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అలీ మహమ్మద్ ఖాన్ తెలిపారు. ఈ తీర్మానాన్ని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ వ్యతిరేకించగా.. మిగతా అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో మెజార్టీ ఓట్లతో పార్లమెంట్‌లో బిల్లు పాస్ అయింది.

Also Read భార్యాబిడ్డలు సహా ఐదుగురి కాల్చివేత: నరహంతకుడి ఉరితీత...

కాగా, 2018లో నౌషెరా అనే ప్రాంతంలో 8 ఏళ్ళ బాలికపై అత్యాచారం, ఆపై హత్య జరిగిన దారుణ ఘటన పాకిస్థాన్‌లో సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆ ఏడాదిలో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి 3,800 కేసులు నమోదైనట్లు పాక్‌కు చెందిన పిల్లల హక్కుల సంస్థ ఒకటి పేర్కొంది. దీనితో మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడేవారిని బహిరంగంగా ఉరి తీయాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోగా.. దీనికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ తీర్మానాన్ని ఆమోదించడంలో పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ఉరి ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధమని.. శిక్షల తీవ్రతను పెంచినంత మాత్రాన నేరాలు తగ్గిపోవడని కొందరు పేర్కొనడం గమనార్హం. కాగా.. ఇలాంటి కామెంట్స్ చేస్తున్నవారిపై కూడా ప్రజలు మండిపడుతున్నారు. 

click me!