దక్షిణాఫ్రికాలో లోయలో పడిన బస్సు: 45 మంది మృతి

By narsimha lodeFirst Published Mar 29, 2024, 8:03 AM IST
Highlights


దక్షిణాఫ్రికాలో  జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి చెందారు.ఈ  ప్రమాదం నుండి ఎనిమిదేళ్ల చిన్నారి సురక్షితంగా బయటపడ్డారు.


జోహాన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో  గురువారం నాడు ఘోర ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 45 మంది మృతి చెందారు.  ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు  లోయలో పడిపోయింది.ఈ ప్రమాదంలో  45 మంది మృతి చెందారు. బోట్సావానా నుండి మోరియాకు  బస్సు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని  రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ ప్రమాదం నుండి ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలతో బయపటడింది. ఆ బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈశాన్య లింపోపో ఫ్రావిన్స్ లో  ఈ ఘటన చోటు చేసుకుంది. 

జోహాన్స్‌బర్గ్ కు ఉత్తరాన 300 కి.మీ. దూరంలోని  మోకోపానే, మార్కెన్ మధ్య  పర్వత మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  ఈ మార్గంలో వంతెన పై నుండి బస్సు లోయలో పడింది.  బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో  ప్రమాదం జరిగిందని రవాణాశాఖ అధికారులు ప్రకటించారు.165 లోతులో ఉన్న లోయలో బస్సు పడిపోవడంతో  మంటలు చెలరేగాయి. ఈ విషయం తెలిసిన వెంటనే  అధికారులు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఘటన స్థలాన్ని రవాణా శాఖ మంత్రి సింధిసివే  పరిశీలించారు.  ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు సంతాపం తెలిపారు.  
 

click me!