Myanmar Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీని జైలుకు త‌ర‌లింపు

Published : Jun 24, 2022, 05:03 AM ISTUpdated : Jun 24, 2022, 05:06 AM IST
Myanmar Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీని జైలుకు త‌ర‌లింపు

సారాంశం

Myanmar Aung San Suu Kyi: మ‌య‌న్మార్ నేత ఆంగ్ సాన్ సూకీని గృహ‌నిర్బంధం నుంచి  రాజ‌ధాని నైపితాలో ఉన్న జైలుకు త‌ర‌లించిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఆ దేశ మిల‌ట‌రీ అరెస్టు చేసింది.   

Myanmar Aung San Suu Kyi:  మయన్మార్ బహిష్కృత నేత ఆంగ్ సాన్ సూకీని  జైలు త‌ర‌లించారు. ఇన్నాళ్లూ గృహ‌నిర్బంధంలో ఉన్న ఆమెను రాజ‌ధాని నైపితాలో ఉన్న జైలుకు త‌ర‌లించిన‌ట్లు మయన్మార్ మిలటరీ ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. ఆమె ఎన్నుకోబడిన ఎన్ఎల్డీ ప్రభుత్వం కుప్ప‌కూలిన త‌రువాత గ‌తేడాది  ఫిబ్రవరి 1న సూకీని మిలటరీ అరెస్టు చేసింది. తొలుత రాజధాని నాపితలోని ఆయన నివాసంలో ఉంచారు, కానీ తర్వాత వేరే ప్రాంతానికి తరలించారు. గత సంవత్సరం కాలంగా..ఆమెను నాపిటాలోని ఒక అజ్ఞాత ప్రదేశంలో ఉంచారు. 

మయన్మార్ పాలక మిలిటరీ కౌన్సిల్ ప్రతినిధి మేజర్ జనరల్ జా మిన్ టున్ మాట్లాడుతూ.. సూకీని బుధవారం నాపిటాలోని ప్రధాన జైలుకు తీసుకెళ్లారని, అక్కడ ఆమెను మిగిలిన ఖైదీల నుండి వేరుగా ఉంచ‌నున్నార‌ని స్పష్టం చేశారు. సూకీని ఇప్పటికే పలు కేసుల్లో దోషిగా తేలిందని, చట్ట ప్రకారం ఆమెను జైలుకు తరలించారని తెలిపారు.

'సూకీకి సహాయం చేసేందుకు మహిళా పోలీసులు'

ముగ్గురు మహిళా పోలీసులతో పాటు కొత్తగా నిర్మించిన భవనంలో ఆమెను ఉంచినట్లు సూకీ కోర్టు వ్యవహారాల గురించి తెలిసిన న్యాయ అధికారి తెలిపారు. ఆమెకు సహాయం చేసేందుకు మహిళా పోలీసులు ఉన్నారు.  ఆమె కేసుల వివరాలను వెల్లడించడానికి ఆమెకు అధికారం లేనందున, కేసుల విచారణ కూడా జైలులోనే నిర్మించిన మరొక కొత్త భవనంలో జరుగుతుందని చెప్పారు.

77వ ఏట అడుగుపెట్టిన సూకీ

ఈ ఆదివారం నాడు 77 ఏళ్లు నిండిన సూకీ.. మునుపటి సైనిక ప్రభుత్వంలో దాదాపు 15 సంవత్సరాలు నిర్బంధంలో గడిపారు, అయితే వాస్తవానికి యాంగోన్‌లోని ఆమె కుటుంబం గృహనిర్బంధంలో ఉంది. ఆమెను ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం రహస్య ప్రదేశంలో నిర్బంధించారు. అంతేకాదు సూకీ తరుఫున న్యాయవాదులు మీడియాతో మాట్లాడకుండా నిషేధం విధించారు. జర్నలిస్టులు సైతం ఆమెను క‌లువ‌డానికి, మాట్లాడేందుకు వీల్లేదు. ఇంతకుముందు కూడా ఆమె మయాన్మార్‌లో అతిపెద్ద నగరమైన యాంగాన్‌లోని తన ఇంటిలోనే చాలాఏళ్లు గృహనిర్బంధంలో ఉంది.

క్రిమినల్‌ చట్టాల ప్రకారం ఆంగ్‌ సాన్‌ సూకీని రాజధాని నైపిడావ్‌లోని జైలులో ఏకాంత నిర్బంధంలో ఉంచామని జుంటా అధికారి జా మిన్‌ తున్‌ పేర్కొన్నారు. ఐతే ఆమె తిరుబాటు చేసినప్పటి నుంచి నేపిడావ్‌లోని ఒక అజ్ఞాత ప్రదేశంలో తన కుక్కతో కలిసి గృహ నిర్బంధంలో ఉన్నారు. సూకీపై అవినీతి సహా పలు ఆరోపణలు ఉన్నాయి. ఆమె పరువు తీయడానికి, సైన్యం అధికారాన్ని చేజిక్కించుకోవడానికి చట్టబద్ధత కల్పించడానికి రాజకీయంగా ఈ ఆరోపణలు చేస్తున్నాయని ఆమె మద్దతుదారులు అంటున్నారు. 

ఒక‌వేళ సూకీపై  ఉన్న ఆరోప‌ణ‌ల‌న్నీ రుజువైతే.. ఆమెకు  దాదాపు 190 ఏళ్ల జైలు శిక్ష ప‌డే అవ‌కాశముంది.  జాతీయ ఎన్నిక‌ల్లో ఎన్ఎల్డీ పార్టీ ఘ‌న విజ‌యం సాధించినా.. ఆ ఎన్నిక‌ల్లో భారీగా ఫ్రాడ్ జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ‌త ఏడాది నుంచి సూకీతో పాటు 14వేల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిలిట‌రీ అణిచివేత‌లో సుమారు రెండు వేల మంది మ‌ర‌ణించారు.

PREV
click me!

Recommended Stories

Longest Expressway Tunnel : ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నెల్ ఎక్కడో తెలుసా?
Viral News: ఉద్యోగుల ఖాతాల్లోకి కోట్ల రూపాయలు డిపాజిట్.. నువ్వు బాస్ కాదు సామీ దేవుడివి