
కెనడాలో మరో హిందూ దేవాలయం విధ్వంసానికి గురైంది. బ్రిటిష్ కొలంబియాలోని ఓ హిందూ దేవాలయాపై శనివారం అర్ధరాత్రి దుండగులు దాడి చేశారు. దానిని దాడి చేశారు. అనంతరం ఆలయ ప్రధాన ద్వారంపై ఖలిస్తాన్ రెఫరెండం పోస్టర్లను అతికించారు. అందులో ‘జూన్ 18 హత్యలో భారత్ పాత్రపై కెనడా దర్యాప్తు చేస్తోంది’ అని పేర్కొని ఉంది. ఈ పోస్టర్లో హర్దీప్ సింగ్ నిజ్జర్ ఫొటో కూడా కనిపిస్తోంది.
‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోని సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారా సాహిబ్ అధిపతిగా ఉండేవారు. అలాగే వేర్పాటువాద సంస్థ ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) చీఫ్ గా వ్యవహరించారు. జూన్ 18న సాయంత్రం గురుద్వారా ఆవరణలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను హత్య చేశారు.
కాగా.. ప్రస్తుతం ధ్వంసమైన ఆలయం సర్రేలోని లక్ష్మీ నారాయణ్ మందిర్, బ్రిటీష్ కొలంబియాలోని అతిపెద్ద, పురాతన హిందూ దేవాలయాలలో ఒకటిగా ఉంది. ఈ ఏడాది కెనడాలో దేవాలయాల విధ్వంసం జరగడం ఇది మూడోసారి. జనవరి 31న కెనడాలోని బ్రాంప్టన్ లోని ప్రముఖ హిందూ దేవాలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై భారత్ వ్యతిరేక నినాదాలతో గ్రాఫిటీ వేశారు. ఈ చర్య భారతీయ సమాజంలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.
అయితే ఆలయ గోడలపై భారత్ ను ఉద్దేశించి విద్వేషపూరిత సందేశాలు రాసిన ఘటనను బ్రాంప్టన్ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్ ఖండించారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్ లో కెనడాలోని ఒంటారియోలోని మరో హిందూ దేవాలయాన్ని భారత్ వ్యతిరేక గ్రాఫిటీతో ధ్వంసం చేశారు. ఈ దేవాలయం గోడలపై ఇద్దరు అనుమానితులు పెయింటింగ్ స్ప్రే చేస్తున్న దృష్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన ఫుటేజీలను విండ్సర్ పోలీసులు విడుదల చేశారు.