అమెరికాలో H1బి వీసా స్కాం : 30 మంది తెలుగు విద్యార్ధులను ముంచిన కిలాడీలు

Bukka Sumabala   | Asianet News
Published : Dec 07, 2020, 11:32 AM IST
అమెరికాలో H1బి వీసా స్కాం : 30 మంది తెలుగు విద్యార్ధులను ముంచిన కిలాడీలు

సారాంశం

అమెరికాలో H1బి  వీసాల పేరుతో తెలుగు విద్యార్థులను వీసాల పేరుతో ఓ కిలాడీ జంట నట్టేట ముంచింది. అమెరికాలో చదువుకుంటూ F1 వీసా ఉన్న విద్యార్థులకు H1 వీసాలు ఇప్పిస్తామని ముత్యాల సునీల్, ప్రణీత అనే జంట 30 మంది తెలుగు విద్యార్థుల దగ్గర రూ. 10 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

అమెరికాలో H1బి  వీసాల పేరుతో తెలుగు విద్యార్థులను వీసాల పేరుతో ఓ కిలాడీ జంట నట్టేట ముంచింది. అమెరికాలో చదువుకుంటూ F1 వీసా ఉన్న విద్యార్థులకు H1 వీసాలు ఇప్పిస్తామని ముత్యాల సునీల్, ప్రణీత అనే జంట 30 మంది తెలుగు విద్యార్థుల దగ్గర రూ. 10 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

కన్సల్టెంట్ కంపెనీ పేరుతో సునీల్, ప్రణీత అనే జంట తెలుగు విద్యార్థుల దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఒక్కో తెలుగు విద్యార్థి నుంచి 25 వేల డాలర్లు వసూలు చేసింది. దీంతో బాధితులు అట్లాంటా హోం ల్యాండ్‌ సెక్యూరిటీలో ఫిర్యాదు చేశారు. అప్పటికే వీరిద్దరూ పరారయ్యారు. వీరు యూరప్ పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. 

వారి కోసం ఇంటర్‌పోల్ నోటీసులు జారీ చేసింది. విద్యార్థుల దగ్గర వసూలు చేసిన డబ్బులను సునీల్ తన తండ్రి ముత్యాల సత్యనారాయణ ఖాతాకు బదిలీ చేశాడు. ఇప్పుడాయన పరారీలో ఉన్నారు. ఇలా విద్యార్థులను మోసగించి సునీల్ పంపిన డబ్బుతో సత్యనారాయణ కోట్ల ఆస్తి కూడబెట్టినట్లు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Train Rules: టికెట్ లేకుండా రైలు ప్ర‌యాణం చేస్తే.. పాకిస్థాన్‌లో ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా.?
IMF: ప్ర‌పంచ దేశాల‌కు ఐఎమ్ఎఫ్ రుణాలు ఇస్తుంది స‌రే.. ఇంత‌కీ IMFకి డ‌బ్బులు ఎక్క‌డివి