రెండేళ్ల నిషేధం తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా అకౌంట్స్ పునరుద్ధరణ.. మొదటి పోస్ట్ ఏంటంటే..

By SumaBala BukkaFirst Published Mar 18, 2023, 12:05 PM IST
Highlights

క్యాపిటల్ అల్లర్లు, జనవరి 6, 2021 తర్వాత ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లలో డొనాల్డ్ ట్రంప్ ఖాతాలను మెటా సస్పెండ్ చేసింది. ఆ తరువాత రెండేళ్లకు తాజాగా పునరుద్దరించింది. 

వాషింగ్టన్ : రెండు సంవత్సరాల పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి నిషేధించబడిన తరువాత యునైటెడ్ స్టేట్స్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తన మొదటి ఫేస్‌బుక్ పోస్ట్ షేర్ చేశారు. "I`M BACK," అంటూ 12 సెకన్ల వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ఇది  ట్రంప్ 2016 ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన విజయ ప్రసంగంలా కనిపించేలా ఉంది. ఇక ఆ వీడియోలో 2024 ఎన్నికల ప్రచారాన్ని కూడా జోడించడానికి ప్రయత్నించారు. 2016 వీడియో తర్వాత, ట్రంప్ తన ప్రసిద్ధ నినాదం "మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్" లేదా MAGAను పోలీ ఇది ఉంది. ట్రంప్ చివరి విజయవంతమైన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఇది బాగా ప్రజాదరణ పొందింది.

ఈ ఫిబ్రవరిలో, మెటా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల విషయంలో  ట్రంప్ పై విధించిన నిషేధాన్ని ఎత్తేసి.. ఖాతాలను పునరుద్ధరించింది. మెటాలో పాలసీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఆండీ స్టోన్ ఈ విషయాన్ని ధృవీకరించారు. సస్పెన్షన్‌ను ఎత్తివేస్తామని జనవరిలో ఫేస్‌బుక్ గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్గ్ చెప్పడంతో, ఇది ముందుగానే ఊహించిందే.

పక్కింటి మహిళను చంపి.. ఆమె గుండెను ఆలుగడ్డ కూరలో వేసి వండి.. కుటుంబసభ్యులకు వడ్డించి.. చివరికి..

క్యాపిటల్ అల్లర్లు, జనవరి 6, 2021 తర్వాత ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోని ట్రంప్ ఖాతాలను మెటా సస్పెండ్ చేసింది. ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉన్న చివరి రెండు వారాల పాటు నిషేధం ప్రారంభమై అది నిరవధిక నిషేధంగా ప్రకటించబడింది. ట్రంప్ ఖాతాపై నిషేధాన్ని అధికారికంగా రెండేళ్లపాటు పొడిగించారు.  జనవరి 6, 2021 నాటి ట్రంప్ చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్, `సేవ్ అమెరికా` మార్చ్‌ను ప్రచారం చేసింది. ట్రంప్ తన మద్దతుదారులను క్యాపిటల్‌పై కవాతు చేయమని ప్రోత్సహించాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ను షేర్ చేస్తూ, "నేను రేపు ఉదయం 11 గంటలకు తూర్పు ఎలిప్స్‌లో సేవ్ అమెరికా ర్యాలీలో మాట్లాడతాను. సమయానికంటే ముందుగానే చేరుకోండి - ఉదయం 7 గంటలకే ద్వారాలు తెరుచుకుంటాయి" సస్పెన్షన్‌కు ముందు ఫేస్‌బుక్‌లో ట్రంప్ చేసిన చివరి పోస్ట్ ప్రజలు క్యాపిటల్‌ను విడిచిపెట్టాలని పిలుపునిచ్చారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లో, ట్రంప్ ఇలా పేర్కొన్నాడు, "యుఎస్ క్యాపిటల్‌లో ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఉండాలని నేను అడుగుతున్నాను. హింస వద్దు! గుర్తుంచుకోండి, మనది లా అండ్ ఆర్డర్ పార్టీ, చట్టాన్ని గౌరవించండి...ఇతర మహిళల్ని, పురుషుల్ని గౌరవించండి.. ధన్యవాదాలు!"

ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌కు వ్య‌తిరేకంగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ

ఇదిలా ఉండగా, శుక్రవారం యూట్యూబ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరించింది. ఈ విషయాన్ని ట్విటర్‌లో తెలుపుతూ... యూ ట్యూబ్ అధికారులు ఇలా అన్నారు, "ఈరోజు నుండి, డోనాల్డ్ జె. ట్రంప్ ఛానెల్ పై నిషేధం లేదు. కొత్త కంటెంట్‌ను అప్‌లోడ్ చేయచ్చు. యూట్యూబ్ లోని ఇతర ఛానెల్‌ల మాదిరిగానే ఈ ఛానెల్  కూడా మా విధానాలకు లోబడి కొనసాగుతుంది. వివాదాస్పదమైన కంటెంట్ విషయంలో కఠినంగానే ఉంటాం" అని యూట్యూబ్ జోడించింది.

click me!