అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 8మంది మృతి

Published : Mar 17, 2021, 08:27 AM ISTUpdated : Mar 17, 2021, 08:38 AM IST
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 8మంది మృతి

సారాంశం

అట్లాంటా నగర శివారులోని మూడు ప్రాంతాల్లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 8 మంది మృతిచెందారు. 

అమెరికాలో కాల్పులు మరోసారి కలకలం రేపాయి. వరుస కాల్పులు, అల్లర్లతో అమెరికా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా అట్లాంటా నగర శివారులోని మూడు ప్రాంతాల్లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 8 మంది మృతిచెందారు. మసాజ్‌ సెంటర్లు, స్పా సెంటర్లను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. 

ఈ ఘటనలో అనుమానితుడిగా భావిస్తున్న రాబర్డ్‌ ఆరన్‌ లాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, గత ఆదివారం కూడా చికాగోలో ఓ పార్టీ జరుగుతుండగా దుండుగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. 13 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన మరువక ముందే మరోసారి దుండగులు కాల్పులు జరపడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో అమెరికాలో దుండుగులు చాలా ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతున్నారు. ఈ కాల్పుల్లో ఇతర దేశాల నుంచి వెళ్లిన ఉద్యోగులు, విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు.

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ