సూడాన్ లో మూసివేసిన బంగారు గని కూలి.. 38మంది మృతి...

Published : Dec 29, 2021, 07:52 AM IST
సూడాన్ లో మూసివేసిన బంగారు గని కూలి.. 38మంది మృతి...

సారాంశం

గత కొంతకాలం క్రితం సూడాన్ ప్రభుత్వం ఈ గనిలో తవ్వకాలను మూసివేసింది.  అయితే బంగారం కోసం స్థానిక ప్రజలు తరచుగా గనిలోకి వెళుతుంటారు. గనులు కూలకుండా ఉండేందుకు ప్రభుత్వం కనీస భద్రత సౌకర్యాలు సైతం కల్పించడం లేదు.  దీంతో సూడాన్ లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. 

సూడాన్ :  ఆఫ్రికా దేశమైన Sudanలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బంగారు గని 38 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ప్రభుత్వం Mining Company తెలిపింది. సూడాన్ రాజధాని ఖార్టోమ్ కు 700 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మూసివేసిన gold mineలో ఈ ఘటన జరిగినట్లు మైనింగ్ కంపెనీ తెలిపింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడినట్లు అక్కడి స్థానిక మీడియా తెలిపింది.

గత కొంతకాలం క్రితం సూడాన్ ప్రభుత్వం ఈ గనిలో తవ్వకాలను మూసివేసింది.  అయితే బంగారం కోసం స్థానిక ప్రజలు తరచుగా గనిలోకి వెళుతుంటారు. గనులు కూలకుండా ఉండేందుకు ప్రభుత్వం కనీస భద్రత సౌకర్యాలు సైతం కల్పించడం లేదు.  దీంతో సూడాన్ లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి.  ఆఫ్రికా ఖండంలో  బంగారం వెలికితీతకు సూడాన్ దేశం ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది.  2020లో ఈ దేశం 36.6 టన్నుల బంగారాన్ని వెలికి తీసింది. 

ఇదిలా ఉండగా, ఈ సంవత్సరం ఆరంభంలో చైనాలోని ఓ బంగారు గనిలో ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. జనవరి 10న చైనాలోని షాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని బంగారు గనిలో పేలుడు జరిగిన రెండు వారాలకు సహాయక బృందాలు ప్రమాదంలో చిక్కుకున్న వారి వద్దకు చేరుకున్నారు. రెండువారాల పాటు గనిలో చిక్కుకున్న వారిలో 10 మంది మృత్యువాత పడగా 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 

చైనా బంగారు గనిలో చిక్కుకొన్న 22 మంది కూలీలు: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్

జనవరి 10న బంగారు గనిలో ప్రమాదం సంభవించగా.. ప్రమాదం జరిగిన విషయం మాత్రం 30 గంటల తర్వాత అధికారులకు తెలిసింది.దీంతో బాధితులను కాపాడే ప్రయత్నాలు ఆలస్యమయ్యాయి. విషయం తెలిసిన అనంతరం హుటాహుటిన నిపుణులను తరలించి వారిని వెలికితీసే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే భూగర్భంలో నీటి తాకిడి భారీగా ఉండడంతో సహాయ చర్యలకు ఆటంకంగా మారింది. 

గని ముఖద్వారంపై వెయ్యి అడుగుల లోతున 70 టన్నుల మట్టి కూరుకుపోవడంతో మరింత కష్టమైంది. వారిని బయటకు తీసేందుకు దాదాపు 15 రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు. లోపల ఉన్నవారి పరిస్థితిపై ఆందోళన చెందిన అధికారులు వీలైనంత త్వరగా బయటకు తీసుకొద్దామని ప్రయత్నించారు. 

రెండు వారాల పాటు తీవ్రంగా శ్రమించి ప్రమాదంలో చిక్కుకున్న వారిని 25వ తేదీన బయటకు తీసుకొచ్చారు. అయితే అధికారులు చేరుకునేలోపు 10 మంది మరణించగా, మరో 11 మంది ప్రాణాలతో ఉన్నారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. మరొక వ్యక్తి ఆచూకీ లభించలేదు. అతడి కోసం అధికారులు వెతుకున్నారు.

అయితే గనిలో పేలుడుకు కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. చైనాలో మైనింగ్‌ పరిశ్రమలో ప్రమాదాలు తరచూ సంభవిస్తుంటాయి. ఏటా దాదాపు 5 వేల మంది మరణిస్తుంటారని ఆ దేశ మీడియా తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?