అమెరికాలో కాల్పుల కలకలం: ముగ్గురు మృతి

Published : Aug 27, 2018, 07:17 AM ISTUpdated : Sep 09, 2018, 12:16 PM IST
అమెరికాలో కాల్పుల కలకలం: ముగ్గురు మృతి

సారాంశం

అమెరికా మరోసారి కాల్పులతో దద్ధరిల్లింది. ఆదివారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, 11 మంది గాయపడ్డారు. జాక్సన్ విల్లేలోని ఉత్తర ఫ్లోరిడా సిటీలో వీడియో గేమ్ టోర్నమెంట్ పోటీదారు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. 

జాక్సన్ విల్లే: అమెరికా మరోసారి కాల్పులతో దద్ధరిల్లింది. ఆదివారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, 11 మంది గాయపడ్డారు. జాక్సన్ విల్లేలోని ఉత్తర ఫ్లోరిడా సిటీలో వీడియో గేమ్ టోర్నమెంట్ పోటీదారు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. 

ఆ తర్వాత తనను కాల్చుకుని మరణించాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని 19 ఏళ్ల డేవిడ్ కట్జ్ గా గుర్తించినట్లు, అతను మేరీలాండ్ లోని బాల్టిమోర్ కు చెందినవాడని చెబుతున్నారు. 

సంఘటనా స్థలంలో మూడు మృతదేహాలు పడి ఉన్నాయని, ఓ మృతదేహం అనుమానితుడికి చెందిందని చెబుతున్నారు. తొమ్మండుగురు బాధితులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఏడుగురికి బుల్లెట్ గాయాలున్ాయి. 

కట్జ్ ఈస్పోర్ట్స్ టోర్నమెంట్ లోని పోటీదారుల్లో ఒక్కడని, అతని వద్ద ఓ హ్యాండ్ గన్ ఉందని చెబుతున్నారు. చికాగో పిజ్జా రెస్టారెంట్ లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో కాల్పులు చోటు చేసుకున్నాయి.

 

PREV
click me!

Recommended Stories

Train Rules: టికెట్ లేకుండా రైలు ప్ర‌యాణం చేస్తే.. పాకిస్థాన్‌లో ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా.?
IMF: ప్ర‌పంచ దేశాల‌కు ఐఎమ్ఎఫ్ రుణాలు ఇస్తుంది స‌రే.. ఇంత‌కీ IMFకి డ‌బ్బులు ఎక్క‌డివి