ఒకే కాన్పులో ఏడుగిరికి జననం

Published : Feb 18, 2019, 12:42 PM IST
ఒకే కాన్పులో ఏడుగిరికి జననం

సారాంశం

ఒకే కాన్పులో ఏడుగురు బిడ్డలకు ఓ మహిళ జన్మనిచ్చింది. ఈ వింత సంఘటన ఇరాక్ లో చోటుచేసుకుంది. 

ఒకే కాన్పులో ఏడుగురు బిడ్డలకు ఓ మహిళ జన్మనిచ్చింది. ఈ వింత సంఘటన ఇరాక్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇరాక్ కి చెందిన 25ఏళ్ల యువతి ఆదివారం దియాలీ ప్రావిన్స్ లోని ఓ ఆస్పత్రిలో ఏడుగురు సంతానానికి జన్మనిచ్చింది. వారిలో ఆరుగురు అమ్మాయిలు.. ఒక అబ్బాయి ఉన్నారు.

ఆమెకు నార్మల్ డెలివరీలోనే ఈ ఏడుగురు జన్మించడం విశేషం. పుట్టిన ఏడుగురు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని అక్కడి వైద్యులు తెలిపారు. తల్లి ఆరోగ్యం కూడా మెరుగ్గానే ఉందని చెప్పారు.అంతకముందు మహిళకు ముగ్గురు సంతానం ఉండగా.. ఇప్పుడు మరో ఏడుగురు మొత్తం కలిపి పదిమంది అయ్యారు. ఈ విషయంపట్ల మహిళ భర్త సంతోషం వ్యక్తం చేశారు.

ఒకే కాన్పులో ఏడుగురికి జన్మనివ్వడం ఇరాక్ లో ఇదే తొలిసారి అని అక్కడి వైద్యులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Space War: పాకిస్థాన్ మరో కుట్ర.. 16 నెలల్లో 6 శాటిలైట్లు.. భారత్‌పై చైనా సాయంతో నిఘా !
POK లో రక్తపాతం.. 19 మంది పిల్లలు, ఏడుగురు గర్భిణీల మృతి.. షాకింగ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్