ఒకే కాన్పులో ఏడుగిరికి జననం

Published : Feb 18, 2019, 12:42 PM IST
ఒకే కాన్పులో ఏడుగిరికి జననం

సారాంశం

ఒకే కాన్పులో ఏడుగురు బిడ్డలకు ఓ మహిళ జన్మనిచ్చింది. ఈ వింత సంఘటన ఇరాక్ లో చోటుచేసుకుంది. 

ఒకే కాన్పులో ఏడుగురు బిడ్డలకు ఓ మహిళ జన్మనిచ్చింది. ఈ వింత సంఘటన ఇరాక్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇరాక్ కి చెందిన 25ఏళ్ల యువతి ఆదివారం దియాలీ ప్రావిన్స్ లోని ఓ ఆస్పత్రిలో ఏడుగురు సంతానానికి జన్మనిచ్చింది. వారిలో ఆరుగురు అమ్మాయిలు.. ఒక అబ్బాయి ఉన్నారు.

ఆమెకు నార్మల్ డెలివరీలోనే ఈ ఏడుగురు జన్మించడం విశేషం. పుట్టిన ఏడుగురు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని అక్కడి వైద్యులు తెలిపారు. తల్లి ఆరోగ్యం కూడా మెరుగ్గానే ఉందని చెప్పారు.అంతకముందు మహిళకు ముగ్గురు సంతానం ఉండగా.. ఇప్పుడు మరో ఏడుగురు మొత్తం కలిపి పదిమంది అయ్యారు. ఈ విషయంపట్ల మహిళ భర్త సంతోషం వ్యక్తం చేశారు.

ఒకే కాన్పులో ఏడుగురికి జన్మనివ్వడం ఇరాక్ లో ఇదే తొలిసారి అని అక్కడి వైద్యులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

పేరుకే పెద్ద‌న్న, బుద్ధి మాత్రం.. హైద‌రాబాద్ చిలుకూరు ఆల‌యంపై అమెరికా సెనేట‌ర్ వివాద‌స్ప‌ద వ్యాఖ్యలు
USA: అమెరికాలో వెలుగులోకి మ‌రో స్కామ్‌.. భార‌తీయ విద్యార్థుల్లో ఆందోళ‌న‌, అస‌లేం జ‌రుగుతోంది.?