ఇద్దరు మైనర్ బాలికలు.. 9మంది హత్యకు కుట్ర

By telugu teamFirst Published Apr 22, 2019, 3:22 PM IST
Highlights

ఇద్దరు మైనర్ పిల్లలు.. చక్కగా స్కూల్ కి వెళ్లి పాఠాలు నేర్చుకోవాల్సిన వయసులో 9మంది హత్య చేసేందుకు కుట్ర పన్నారు. చివరకు మీడియా ద్వారా బయటకు లీకై.. జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు.

ఇద్దరు మైనర్ పిల్లలు.. చక్కగా స్కూల్ కి వెళ్లి పాఠాలు నేర్చుకోవాల్సిన వయసులో 9మంది హత్య చేసేందుకు కుట్ర పన్నారు. చివరకు మీడియా ద్వారా బయటకు లీకై.. జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. ఈ సంఘటన ఫ్లోరిడాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సౌత్ ఆర్లాండోకి 74మైళ్ల దూరంలో ఉన్న ఎనోవ్ పార్క్ మిడిల్ స్కూలో చదివే ఇద్దరు మైనర్ బాలికలు రహస్యంగా మాట్లాడుకోవడం ఓ టీచర్ గమనించింది. అనుమానం వచ్చి వాళ్ల చేతుల్లో ఉన్న ఓ ఫోల్డర్ ని తీసుకుంది. దాని మీద ప్రైవేట్ ఇన్ఫో.. ఎవ్వరూ ఓపెన్ చేయవద్దని ఉంది. 

టీచర్ ఓ పెన్ చేసి చూడగా.. ప్రాజెక్ట్ 11\9 అనే టైటిల్‌తో ఒక భారీ స్కెచ్ గురించిన డీటెయిల్స్ వున్నాయందులో. వెంటనే షాక్ అయిందామె.ఏదో ప్రాంక్ ఏమో అనుకొని వదిలేసింది. 

అందులో ‘ తుపాకీలు ఎలా సంపాదించాలి, తొమ్మిది మందిని ఎలా చంపాలి, శవాలను ఎలా మాయం చేయాలి’ తదితర విషయాలకు సంబంధించి సమాచారాన్ని ఆ బాలికలు సేకరించారు.  ఈ విషయం మీడియాకు ఎలా తెలిసిందో... టీవీలో ప్రసారం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలికలను     అరెస్ట్ చేశారు. మైనర్ బాలికలు కావడంతో జువైనల్ కోర్టుకు తరలించారు. 

click me!