ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల దాడి.. 16మంది మృతి

By telugu news teamFirst Published Feb 5, 2021, 12:34 PM IST
Highlights

త‌పాయి అక్త‌ర్‌ ఏరియాలో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను ల‌క్ష్యం చేసుకుని కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. తాలిబ‌న్ల దాడుల్లో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, మ‌రికొందరు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. 

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. ఖాన్ అబాద్ జిల్లాలో తాలిబ‌న్లు ర‌క్త‌పుటేరులు పారించారు. త‌పాయి అక్త‌ర్‌ ఏరియాలో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను ల‌క్ష్యం చేసుకుని కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. తాలిబ‌న్ల దాడుల్లో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, మ‌రికొందరు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.  మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఈ ఘ‌ట‌న గురువారం రాత్రి చోటు చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జ‌రిగిన ప్రాంతానికి భ‌ద్ర‌తా బ‌ల‌గాలు చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించాయి. తాలిబ‌న్ల ఆచూకీ కోసం బ‌ల‌గాలు గాలింపు చ‌ర్య‌లు మొద‌లుపెట్టాయి. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

click me!