ఐసీసీ చక్రవర్తిగా కోహ్లీ ఫోటో.. తప్పుపట్టిన మైఖేల్ వాన్

By telugu teamFirst Published Jun 6, 2019, 12:52 PM IST
Highlights

టీం ఇండియా విరాట్ కోహ్లీపై ఐసీసీ చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. కోహ్లీ నెంబర్ వన్ అనే అర్థంతో... ఐసీసీ కోహ్లీ ఫోటో నెట్టింట షేర్ చేయగా... కొందరు దానిని తప్పు పడుతున్నారు.


టీం ఇండియా విరాట్ కోహ్లీపై ఐసీసీ చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. కోహ్లీ నెంబర్ వన్ అనే అర్థంతో... ఐసీసీ కోహ్లీ ఫోటో నెట్టింట షేర్ చేయగా... కొందరు దానిని తప్పు పడుతున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... విరాట్ కోహ్లీని ఓ చ‌క్ర‌వ‌ర్తిలా చూపిస్తూ బుధ‌వారం ఐసీసీ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఓ ట్వీట్ చేసింది. సింహాస‌నంపై కోహ్లీ ఓ చ‌క్ర‌వ‌ర్తిలా కూర్చున్నాడు. ఒక చేతిలో బ్యాట్‌.. మ‌రో చేతితో బంతి.. కిరీటం స్థానంలో ఐసీసీ లోగోని ఏర్పాటు చేశారు. 

ఈ షోటో చూసి కోహ్లీ అభిమానులు సంబరపడుతుంటే... మరో వైపు విమర్శలు కూడా అదేస్థాయిలో వినపడుతున్నాయి.  ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా ఆ ట్వీట్‌పై రియాక్ట్ అయ్యారు. ఐసీసీ తీరును ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. ఐసీసీ చేసిన ట్వీట్ నిష్ప‌క్ష‌పాతంగా లేదంటూ ఓ ట్వీట్ చేశారు. 

ఆ ట్వీట్‌కు ఐసీసీ కౌంట‌ర్ ఇచ్చింది. కోహ్లీ అన్ని ఫార్మాట్ల‌లో నెంబ‌ర్ వ‌న్ అంటూ మ‌రో ట్వీట్‌ను చేసింది. కింగ్ కోహ్లీ ఫోటోను ఐసీసీ స‌మ‌ర్థించుకుంది. వ‌న్డే, టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీ నెంబ‌ర్ వ‌న్ అంటూ పేర్కొంది. కొన్ని స్క్రీన్ షాట్స్‌తో ఆ విష‌యాన్ని వెల్ల‌డించింది. మైఖేల్ వాన్ కి ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చిందంటూ... కోహ్లీ అభిమానులు ఆనందపడుతున్నారు. వరల్డ్ కప్ జరుగుగతున్న సమయంలో.. ఐసీసీ ఇలా ట్వీట్ చేయడం కొందరికి నచ్చడంలేదని తెలుస్తోంది. 

👑 pic.twitter.com/cGY12LaV3H

— ICC (@ICC)


 

click me!