హెర్బల్ ఆయిల్ వ్యాపారం అంటూ.. మొత్తం ఊడ్చేశారు..

By AN TeluguFirst Published Nov 12, 2020, 2:09 PM IST
Highlights

హెర్బల్ ఆయిల్ వ్యాపారంతో లాభాలు గడించొచ్చన వ్యాపారి ఆశను సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకున్నారు. ఏకంగా 52 లక్షలకు కుచ్చుటోపీ వేశారు. మోసపోయనని తెలుసుకునేసరికి నూనె పెట్టుకోవడానికి లేకుండా జుట్టుకూడా ఊడిపోయేంత టెన్షన్ లో మునిగిపోయాడు.
 

హెర్బల్ ఆయిల్ వ్యాపారంతో లాభాలు గడించొచ్చన వ్యాపారి ఆశను సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకున్నారు. ఏకంగా 52 లక్షలకు కుచ్చుటోపీ వేశారు. మోసపోయనని తెలుసుకునేసరికి నూనె పెట్టుకోవడానికి లేకుండా జుట్టుకూడా ఊడిపోయేంత టెన్షన్ లో మునిగిపోయాడు.

హైదరాబాద్ అమీర్ పేటకు చెందిన ఓ వ్యాపారికి హెర్బల్ ఆయిల్ మర్చంట్లమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు నిండా ముంచారు. హెర్బల్ ఆయిల్ పేరతో 52లక్షల రూపాయలకు దండుకున్నారు. ఈ వ్యవహారమంతా మణిపూర్ కేంద్రంగా సాగిందని బాధితుడు తెలిపారు. 

పోలీసుల కథనం ప్రకారం.. అమీర్ పేటకు చెందిన వ్యాపారికి హెర్బల్ ఆయిల్ సరఫరా చేస్తామని నమ్మబలికిన సైబర్ నేరగాళ్లు రూ. 52 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. వారి మాటలు గుడ్డిగా నమ్మిన వ్యాపారి ఆ డబ్బును వారికి పంపించాడు. 

డబ్బు పంపిన తరువాత ఎంతకూ హెర్బల్ ఆయిల్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన వ్యాపారి ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు కోసం సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేశారు. 

click me!