నాచారం డీపీఎస్ స్కూల్‌కు బాంబు బెదిరింపు, పోలీసుల తనిఖీలు

Siva Kodati |  
Published : Mar 10, 2020, 02:37 PM ISTUpdated : Mar 10, 2020, 02:39 PM IST
నాచారం డీపీఎస్ స్కూల్‌కు బాంబు బెదిరింపు, పోలీసుల తనిఖీలు

సారాంశం

నాచారంలోని ఓ స్కూల్‌కు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు, అధికారులు, పాఠశాల సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. స్థానిక డీపీఎస్ స్కూలులో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు మెయిల్ ద్వారా సందేశం పంపాడు. 

నాచారంలోని ఓ స్కూల్‌కు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు, అధికారులు, పాఠశాల సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. స్థానిక డీపీఎస్ స్కూలులో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు మెయిల్ ద్వారా సందేశం పంపాడు.

దీంతో స్కూలు యజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్ సాయంతో పాఠశాల వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ హడావిడితో విద్యార్ధులు, చిన్నారులు భయాందోళనలకు గురయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?