#Samantha:విజయ్ దేవరకొండకు సమస్యగా మారిన సమంత?

By Surya PrakashFirst Published Sep 16, 2022, 8:08 AM IST
Highlights

లైగర్ సినిమా డిజాస్టర్ తో నిరాశలో ఉన్న విజయ్ దేవరకొండ తమ తాజా చిత్రం ఖుషీతో ఒడ్డున పడదామనుకుంటున్నారు. సమంతతో తన కాంబినేషన్ హిట్ అవుతుందని నమ్మి ముందుకు వెళ్తున్నారు. 


రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సమంత (Samantha) జంటగా నటిస్తున్న సినిమా ఖుషి (Khushi). శివ నిర్వాణ (Siva Nirvana) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, ఈ సినిమాతో ముగ్గురు హిట్ అందుకుంటారనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది.  అయితే ప్రాజెక్టు లేటు అవుతోంది. అందుకు కారణం సమంత అని వార్తలు వస్తున్నాయి. 

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా రూపొందిన  ‘పుష్ప’ (Pushpa) తర్వాత సమంతకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ  చిత్రంలోని ‘ఊ అంటావా మావా’ పాట సూపర్ హిట్టవడంతో.. ఆ తర్వాత నుంచి సమంత (Samantha) వరస ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు  వరస ఒప్పేసుకుంటోంది.  సమంత కు క్రేజ్ రావటం ప్రస్తుతం ఆమెతో సినిమా చేస్తున్న నిర్మాతలకు ఉత్సాహాన్ని ఇచ్చే విషయమే కానీ...ఆమె వల్ల తమ ప్రాజెక్టు డిలే అవుతోందని గోలెత్తిపోతున్నట్లు సమాచారం.

అసలే లైగర్ సినిమా డిజాస్టర్ తో నిరాశలో ఉన్న విజయ్ దేవరకొండ తమ తాజా చిత్రం ఖుషీతో ఒడ్డున పడదామనుకుంటున్నారు. సమంతతో తన కాంబినేషన్ హిట్ అవుతుందని నమ్మి ముందుకు వెళ్తున్నారు. అయితే అదే సమంత డేట్స్ విషయంలో క్లాష్ వచ్చి ప్రాజెక్టు లేటు అవుతోందని భావిస్తున్నారట. వాస్తవానికి అక్టోబర్ రెండవ వారం నుంచి ఖుషీ నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉమంది. కానీ సమంత డేట్స్ దొరక్క ఆగారని తెలుస్తోంది. ఆమె కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ తో తీయాల్సిన సీన్స్ అవి. 

ఇక దర్శకుడు శివ నిర్వాణ కూడా తన గత చిత్రం టక్ జగదీష్‌తో హ్యాట్రిక్ హిట్ అందుకుంటానని చాలా నమ్మకంగా ఉన్నాడు. నిన్నుకోరి, మజిలీ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న శివ నిర్వాణ నానితో తీసిన టక్ జగదీష్ మాత్రం ఫ్లాపయి షాకిచ్చింది. దాంతో ఇప్పుడు ఖుషి సినిమా మీదే నమ్మకాలన్నీ పెట్టుకున్నాడు. ఇటీవల విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో వచ్చి ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో, ప్రమోషన్స్‌లో విజయ్ మాట్లాడిన తీరు చూస్తే సినిమా బ్లాక్ బస్టర్ అనే అందరూ మాట్లాడుకున్నారు.కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లైగర్ డిజాస్టర్ సినిమాల లిస్ట్‌లో చేరింది.  

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సమంత పరిస్థితి కూడా అంతే.కమిటవడానికి వరుసగా సినిమాలు కమిటైంది గానీ..అవి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఉన్నాయి. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న శాకుంతలం వీఎఫెక్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. అలాగే, యశోద కూడా చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. వాస్తవంగా ఆగస్టు 12న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ, పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడింది.   సమంత నటించిన గత చిత్రం కణ్మణి రాంబో ఖతీజా కూడా ఫ్లాప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

click me!