ప్రస్తుతం జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలలో నెలవారీ పాస్లు జారీ చేస్తున్నారు. నెలకు రూ. 340 చెల్లించాలి. అంటే ఏడాదికి రూ. 4,080 ఖర్చు అవుతుంది. 2023-24లో మొత్తం టోల్ ఆదాయం రూ. 55,000 కోట్లు. దీనిలో ప్రైవేట్ కార్ల వాటా రూ. 8,000 కోట్లు. కొత్త పథకం అమలులోకి వస్తే, జాతీయ రహదారుల అథారిటీ కొంత ఆదాయాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.