Air India Namaste World Sale : ఎర్రబస్సు ఎక్కినంత ఈజీగా ఎయిరిండియా విమానమెక్కండి

Published : Feb 03, 2025, 11:32 PM IST

Air India Offer : ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా తమ వినియోగదారులకు బంపరాఫర్ ప్రకటించింది. ఎర్రబస్సు ఎక్కినంత ఈజీగా ఎయిరిండియా విమానమెక్కి ప్రయాణించేలా ఆ ఆఫర్ వుంది. ఇంతకూ అదేంటో తెలుసుకోండి.     

PREV
13
Air India Namaste World Sale :  ఎర్రబస్సు ఎక్కినంత ఈజీగా ఎయిరిండియా విమానమెక్కండి
air india namaste world sale

విమాన ప్రయాణం అంటేనే చాలా కాస్ట్లీ అనే భావన ప్రజల్లో వుంది. ఈ అభిప్రయాన్ని తొలగించే ప్రయత్నంచేస్తోంది ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా. టికెట్ ఖర్చుగురించి ఆలోచించకుండా ఎర్రబస్సు ఎక్కినంత ఈజీగా ప్రయాణికులతో ఎయిరిండియా విమానం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఓ సూపర్ ఆఫర్ ప్రకటించింది ఎయిరిండియా. 

 

23
air india namaste world sale

ఎయిర్ ఇండియా 'నమస్తే వరల్డ్' సేల్ పేరుతో టికెట్ ధరను భారీగా తగ్గించి అమ్ముతోంది. ఈ ఆఫర్ ద్వారా ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించాాలని అనుకునేవారు వెంటనే టికెట్ బుక్ చేసుకొండి. ఎందుకంటే ఇప్పటికే టికెట్ బుకింగ్ ప్రారంభమయ్యింది. 

ఫిబ్రవరి 2 నుండి ఎయిరిండియా నమస్తే వరల్డ్ టికెట్స్ ఆఫర్ ప్రారంభమయ్యింది. ఫిబ్రవరి 6 వరకు అంటే వచ్చే గురువారం వరకు ఆ ఆఫర్ వుంటుంది. కాబట్టి ఆలోపు టికెట్స్ బుక్ చేసుకున్నవారికి అతి తక్కువ ఖర్చులో ఎయిరిండియా విమానంలో ప్రయాణించవచ్చు. 

ఈ ఆఫర్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్నవారు ఫిబ్రవరి 12 నుండి అక్టోబర్ 31, 2025 వరకు ప్రయాణించవచ్చు. ఈ ఆఫర్ దేశీయ ప్రయాణాలకే కాదు అంతర్జాతీయ ప్రయాణాలకు కూడా వర్తిస్తుంది. 

 

 

 

33
air india namaste world sale

ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్ ఆఫర్ ఎకానమీతో పాటు ప్రీమియం, బిజినెస్ క్లాసుల్లో అందుబాటులో వుంది. దేశీయంగా ఎకానమి క్లాస్ టికెట్ ధర కేవలం రూ.1499 మాత్రమే. ఇక ప్రీమియం ఎకానమీ రూ.3,749, బిజినెస్ క్లాస్ రూ.9,999 నుండి ప్రారంభం అవుతాయి.

అంతర్జాతీయ ప్రమాణాలకు అయితే ఎకానమీ టికెట్ ధర రూ.12,577 గా వుంది. ఇక ప్రీమియం ఎకానమీ రూ.16,213, బిజినెస్ క్లాస్ రూ.20,870 గా వుంది. 

టిక్కెట్లను ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలి. కన్వీనియెన్స్ ఫీజు ఉండదు. పరిమిత సంఖ్యలో సీట్లకు మాత్రమే ఈ సేల్ వర్తిస్తుంది. కాబట్టి త్వరగా బుక్ చేసుకుంటే మంచిది.

click me!

Recommended Stories