రైల్వే శాఖకు రద్దు ఆదాయంపై ప్రత్యేక ఖాతా లేదని ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అయితే 2017-2020 మధ్య రైల్వే టికెట్ రద్దు ద్వారా రూ.9000 కోట్లు ఆర్జించినట్లు రైల్వే ఇన్ఫర్మేషన్ సెంటర్ (CRIS) తెలిపింది.
IRCTC కన్వీనియన్స్ ఛార్జీ, రద్దు ఛార్జీలను వసూలు చేస్తుంది. ఫిబ్రవరి 8, 2023న పార్లమెంటులో మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం కన్వీనియన్స్ ఛార్జీ ద్వారా 2019-20లో రైల్వే డిపార్ట్ మెంట్ కి రూ.352.33 కోట్లు, 2020-21లో రూ.299.17 కోట్లు, 2021-22లో రూ.694.08 కోట్లు, 2022-23లో రూ.604.40 కోట్లు ఆదాయం లభించింది. అంటే క్యాన్సిలేషన్ టికెట్ల ద్వారా ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తోందన్న మాట.