మొదటి రోజు...
వైజాగ్ నుంచి అరకు వెళ్లడానికి ఉదయం 6.45 గంటలకు కిరండల్ అనే పాసింజర్ ట్రైన్ ఉంటుంది. ఇందులో ఒక్కరికి రూ.45 టికెట్ ఉంటుంది. అరకు చేరుకున్నాక టెంట్ రెంట్ కి తీసుకుంటే రోజుకు రూ.800 కడితే సరిపోతుంది. ఇద్దరు స్టే చేయొచ్చు.
తర్వాత అక్కడ ఫ్రెష్అప్ అయి ఆటో మాట్లాడుకుంటే మనిషికి రూ.250 తీసుకుంటారు. చుట్టుపక్కల ఉన్న సూపర్ వ్యూ పాయింట్స్ చూపిస్తారు.
అవేంటంటే.. చాపరేయ్ వాటర్ ఫాల్స్, సన్ ఫ్లవర్ గార్డెన్, అరకు పైనరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ, ట్రైబల్ మ్యూజియం. ఇవన్నీ చూసి వచ్చే సరికి కచ్చితంగా సాయంత్రం అయిపోతుంది. నైట్ టెంట్ లో విశ్రాంతి తీసుకొని రెండో రోజు ఉదయం మళ్లీ ప్రకృతి అందాలను చూసేందుకు వెళ్లిపోవచ్చు.