Published : Jun 14, 2021, 02:41 PM ISTUpdated : Jun 14, 2021, 02:44 PM IST
న్యూడిల్లీ: హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఇప్పటికే రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. డిల్లీలో బిజెపి పెద్దల సమక్షంలో ఆయన బిజెపి కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కరీంనగర్ మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా బిజెపిలో చేరారు.