అయితే పలు రాష్ట్రాల్లో గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేదనేది చూస్తునే ఉన్నామని.. అయితే సభకు సందేశం పంపే హక్కును గవర్నర్ వినియోగించుకున్న సందర్భం చాలా దశాబ్దాలుగా జరగలేదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గవర్నర్ సందేశం పంపిన తర్వాత, సభ దానిని ప్రతికూలంగా లేదా సానుకూలంగా పరిగణించాలని అంటున్నారు. అయితే సభ్యులు సందేశాన్ని పరిగణించి, బిల్లులను అసలు రూపంలో ఆమోదించడానికి ఎంచుకున్నారని స్వయంచాలకంగా ఊహించబడుతుందని పేర్కొంటున్నారు.