లాక్ డౌన్ వేళ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఎలా రూపు మారిందో చూడండి

First Published Apr 24, 2020, 8:35 PM IST

హైదరాబాద్ లోని మన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లాక్ డౌన్ తరువాత, ప్రజల ఆరోగ్య రీత్యా కరోనా వైరస్ నుండి వారిని వారు రక్షించుకునేందుకు వీలుగా ప్రయాణీకుల మధ్య భౌతిక దూరం కోసం ఏర్పాట్లను చేసింది. 

కరోనా మహమ్మారి దెబ్బకు భారత దేశమంతా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తొలిసారి విధించిన లాక్ డౌన్ ను రెండవదఫాపొడిగించారు కూడా. అలా పొడిగించిన లాక్ డౌన్ కూడా మరో 9 రోజుల్లో ముగియనుంది(తెలంగాణాలో మే 7వతేది అనుకోండి).
undefined
ఈ కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ తరువాత ప్రజల దైనందన జీవితాల్లో చాలా మార్పులు వస్తాయని అందరూ చెబుతూనేఉన్నారు. ఇప్పటికేమనం మనకందరికీ ఎంతో అలవాటైన షేక్ హ్యాండ్ ను పూర్తిగా మానేశాము.
undefined
బయట ఎక్కడ పడితే అక్కడ ఉమ్మే మన జనం చాలా వరకు దాన్నికూడా తగ్గించుకున్నారు. మాస్కులను ధరిస్తున్నారు. ఇంతకుముందు తినేటప్పుడు కూడా చేతులు కడగడానికి బద్ధకించే మన జనాలు ఇప్పుడు తరచుగా చేతులను కడుగుతూహైజీన్ని పాటిస్తున్నారు.
undefined
లాక్ డౌన్ తరువాత మన జీవితంలో మనం ఊహించని ఎన్నో మార్పులురావడం ఖాయంగాకనబడుతుంది. ఇంతకు మునుపులా బస్సుల్లోకిక్కిరిసినప్రయాణాలు ఉండకపోవచ్చు. ఆఫీస్ లో ఒకరినొకరు పలకరించుకోవడానికి చేసుకునే ఆలింగనాల ఊసే ఉండకపోవచ్చు కూడా.
undefined
లాక్ డౌన్ ముగిసిన తరువాత కూడా కరోనా వైరస్ మనల్ని వదిలైతేపోదు కాబట్టి మనం ఆ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉంటూ సోషల్ డిస్టెంసింగ్ పాటించడమే మార్గం. ఇందుకు తగ్గట్టుగానేబయట కూడా అలంటి ఏర్పాట్లే చేయాల్సి ఉంటుంది.
undefined
ప్రభుత్వం, ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని జన సమ్మర్ధప్రాంతాల్లోప్రజలమధ్య భౌతిక దూరం పాటించేలాఏర్పాట్లను చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ లోని మన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లాక్ డౌన్ తరువాత, ప్రజల ఆరోగ్యరీత్యా కరోనా వైరస్ నుండి వారిని వారు రక్షించుకునేందుకు వీలుగా ప్రయాణీకులమధ్య భౌతిక దూరం కోసంఏర్పాట్లను చేసింది.
undefined
ఎయిర్ పోర్టుల్లో మనం చెక్ ఇన్ అయ్యే దగ్గర ఎప్పటిలాగే ఉండే క్యూ లైన్లలో డబ్బాలను గీశారు. ఒక్కో డబ్బా మధ్య గ్యాప్ ను వదిలారు. ఇలా గ్యాపులు ఉండడంద్వారా ప్రయాణీకుల మధ్య భౌతిక దూరం మెయింటైన్చేయడం తేలికవుతుంది.
undefined
ఎయిర్ పోర్టులో చాలా చోట్ల పాదాల బొమ్మలను నేలపైన స్టిక్కర్లుగా అతికించారు. దాని పక్కన మెయింటైన్సోషల్ డిస్టెంసింగ్ అని రాసారు. ఇలా విమానాశ్రయం లో చాలా చోట్ల అతికించారు. కొన్నిసార్లు ప్రయాణీకులు మరిచిపోయినా వాటిని చూసిభౌతిక దూరం గుర్తొస్తుంది. రానురానూఅది వారిలో భాగమయిపోతుంది.
undefined
ఇకపోతే కూర్చునేకుర్చీల్లో కూడా కుర్చీకికుర్చీకి మధ్య గ్యాప్ వదిలారు. అక్కడ కూర్చోవద్దు అన్నట్టుగా బొమ్మను కూడా వేశారు. ఎయిర్ పోర్ట్లాంజ్ లో వెయిటింగ్ ఏరియాలోఅన్ని చోట్లాఉన్నకుర్చీల్లోఈ బొమ్మలు మనకు కనబడుతాయి.
undefined
ఇక పోతే,విమానం దిగాక మనం బయటకు వచ్చే దగ్గర ఉండే క్యాబ్ బుకింగ్ పాయింట్ల దగ్గర కూడా డబ్బాలను గీశారు. ప్రయాణీకులు క్యాబ్ లను బుక్ చేసుకోవడానికి ఆ డబ్బాలలో మాత్రమే నిలబడాల్సి ఉంటుంది.
undefined
లాక్ డౌన్ తరువాత అయినా మనం వాక్సిన్ వచ్చే వరకు లేదా మందు కనుక్కునే వరకు ఈ కరోనామహమ్మారితో సహవాసం చేయక తప్పదు. ఎలాగూ ఆ వైరస్ తో పాటు ఒకే సమాజంలో జీవించాలి కాబట్టి, ఆ మహమ్మారి బారి నుండి మనల్ని మనం సోషల్ డిస్టెంసింగ్ అనే లక్ష్మణ రేఖ ద్వారా మాత్రమే కాపాడుకోగలం.
undefined
click me!