రంగనాయక సాగర్ నీటిని విడుదల చేసిన హరీష్: దూకి ఈత కొట్టిన ఏంపీ కొత్త, ఎమ్మెల్యే రసమయి

First Published May 2, 2020, 3:21 PM IST

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం  చందలాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదలకు ప్రత్యేక పూజలు చేసి నీళ్లు వదిలారు మంత్రి హరీష్ రావు. 

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదలకు ప్రత్యేక పూజలు చేసి నీళ్లు వదిలారు మంత్రి హరీష్ రావు.
undefined
ఆయనతోపాటుగా ఈ కార్యక్రమానికిఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, రసమయి బాలకిషన్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
undefined
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ...ఇవాళ కుడి, ఎడమ కాలువల ద్వారా నీటి విడుదల చేయడం మరుపు రాని రోజని, ఈ రోజు కోసం తరతరాలుగా రైతులు ఎదురు చూపులు చూశారని,ఈ రోజు ఈ నీళ్లను చూస్తుంటే, నిజమా అన్నట్లు ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేసారు.
undefined
కాలువల వెంట బిరబిరా గోదారమ్మ పరిగెడుతుంటే, రైతుల కళ్లల్లో ఆనంద భాష్పాలు కారుతున్నాయని,ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించిన సీఎం కేసీఆర్, ఇంజనీర్లకు, కార్మికులకు ధన్యవాదాలుతెలిపారు హరీష్ రావు.
undefined
ఇంత కాలం రైతులు, కరెంట్, కాలం మీద ఆధారపడి వ్యవసాయం చేశారని,ఇక నుంచి కరెంట్, కాలంతో నిమిత్తం లేకుండా రెండు పంటలు పండించే రోజులు వచ్చాయని ఆయన ఆనందం వ్యక్తం చేసారు.
undefined
ఒకనాడు ఈ ప్రాంతంలో కాలం అయితేనే రైతులకడుపు నిండేదని,ఒకనాడు ఇక్కడి రైతుల పరిస్థితి అప్పులతో ఆత్మహత్య చేసుకునేపరిస్థితని, ఇక నుంచి ఆత్మ హత్యలకు పుల్ స్టాఫ్ పడ్డట్టే అని, కరువు అనే పదాన్ని డిక్షనరీ నుంచి తీసేశామని ఆయన అన్నారు.
undefined
365 రోజుల పాటు రంగనాయక సాగరుకు నీళ్లు వస్తాయి కాబట్టి కరువుకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతున్నామని,కాలిపోయిన మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లపై రైతులు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేవారని,ఇక నుంచి రైతులు ఖచ్చితంగా రెండు పంటలు పండించుకునే శుభదినం నేడు ప్రారంభమైందని ఈ సందర్భంగా హరీష్ రావు వ్యాఖ్యానించారు.
undefined
ప్రధాన ఎడమ కాలువలో గోదావరి జలాలు ప్రవహిస్తుండటంతో సంబురంతో కాల్వ జలాలు ఏంపీ, ఎమ్మెల్యేలపై చల్లుతూ నీళ్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన మంత్రి హరీశ్ రావు. ఈ మేరకు మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చిన్నకోడూర్, నారాయణరావు పేట మండల ప్రజాప్రతినిధులు సంబురంతో కాలువల్లో దూకి ఈత కొట్టారు.
undefined
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, స్థానికులతో మంత్రి హరీశ్ సెల్ఫీలు దిగి నీళ్లు విడుదలైన సంబురాన్ని పంచుకున్నారు.
undefined
click me!