రాష్ట్రపతి ఎన్నికలతో పాటు ప్రతిపక్ష పార్టీలపై కేంద్రం సీబీఐ, ఈడీ, ఐటీ ఏజెన్సీలను ఎలా దుర్వినియోగం చేస్తోందనే దానిపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కేసీఆర్ మే చివరి వారంలో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడను కలిశారు. అయితే జాతీయ పార్టీని స్థాపించాలని నిర్ణయించుకున్న తర్వాత ఆయన పశ్చిమ బెంగాల్, బీహార్ పర్యటనలను రద్దు చేసుకున్నారు.