ఆ రికార్డులు బ్రేక్: 59 రోజుల తర్వాత తెలంగాణలో రోడ్లపైకి ఆర్టీసీ బస్సులు

First Published May 19, 2020, 10:25 AM IST

రోజుల తరబడి ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.గతంలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయిన చరిత్ర ఉంది. గత రెండు రికార్డులను బ్రేక్ చేసింది లాక్ డౌన్. లాక్ డౌన్ కారణంగా సుమారు 59 రోజుల పాటు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

సుమారు 59 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు మంగళవారం నాడు రోడ్డెక్కాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సకల జనుల సమ్మె, తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కాలంలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అయితే లాక్ డౌన్ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 59 రోజుల పాటు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
undefined
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహించారు. ఆ సమయంలో విద్యుత్, సింగరేణి, ఆర్టీసీ కార్మికులు సకల జనుల సమ్మెలో కీలకంగా పాల్గొన్నారు.
undefined
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో ఆనాడు జేఎసీ పిలుపు మేరకు సకల జనుల సమ్మె నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె కీలకమైన ఉద్యమం. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 42 రోజుల పాటు సమ్మె చేశారు. ఈ సమ్మెలో ఆర్టీసీ, తెలంగాణ ఎన్‌జీవోలు, సింగరేణి కార్మికులు కీలకంగా ఉన్నా
undefined
2011 సెప్టెంబర్ 13వ తేదీ నుండి ఆనాడు సకల జనుల సమ్మె ప్రారంభమైంది. సమ్మెలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు 42 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ తర్వాత సకల జనుల సమ్మెలో ఉద్యోగులకు ప్రత్యేక లీవ్ గా పరిగణిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
undefined
ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2019 అక్టోబర్ 5వ తేదీ నుండి తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెను ప్రారంభించారు. సుమారు 55 రోజుల తర్వాత ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు. 2019 నవంబర్ 29వ తేదీన ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించి విధుల్లో చేరారు.
undefined
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా ఈ ఏడాది మార్చి 23వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతోంది.లాక్ డౌన్ ను పురస్కరించుకొని ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపివేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఈ నెల 18వ తేదీన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
undefined
హైద్రాబాద్ పట్టణంలో సిటీ బస్సులు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల రాకపోకలు ఇవాళ ప్రారంభమయ్యాయి. సుమారు 59 రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులు తెలంగాణ రాష్ట్రంలో రోడ్లపైకి వచ్చాయి.
undefined
మరో వైపు అంతరాష్ట్ర బస్సు సర్వీసులను కూడ ఆర్టీసీ నిలిపివేసింది. అంతరాష్ట్ర బస్సు సర్వీసులను ప్రారంభిస్తే కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.
undefined
click me!