లాక్‌డౌన్ ఎఫెక్ట్: జీహెచ్ఎంసీ పరిధిలో సగానికి తగ్గిన మద్యం విక్రయాలు

First Published May 21, 2020, 10:25 AM IST

తెలంగాణలో మద్యం విక్రయాలు ఈ నెల 6వ తేదీన ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాల్లో సగ భాగం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటాయి. లాక్ డౌన్ తర్వాత గ్రేటర్ లో మద్యం విక్రయాలు భారీగా పడిపోయాయి.

తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ విక్రయాల్లో గ్రేటర్ హైద్రాబాద్ టాప్ లో ఉండేది. లాక్ డౌన్ ఆంక్షల సడలింపులో భాగంగా మద్యం విక్రయాలకు సడలింపులు ఇవ్వడంతో బీర్ల విక్రయాలు గతంలో మాదిరిగా లేవని గణాంకాలు చెబుతున్నాయి.
undefined
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను తెలంగాణలో ఈ ఏడాది మార్చి 23వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ కారణంగా మద్యం విక్రయాలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది.
undefined
ఈ నెల 6వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలను ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం.ఈ నెల 5వ తేదీన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మద్యం ధరలను 16 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. చీప్ లిక్కర్ పై 11 శాతం, ఖరీదైన మద్యంపై 16 శాతం పెంచింది తెలంగాణ ప్రభుత్వం.
undefined
జీహెచ్ఎంసీ పరిధిలోని 400 మద్యం దుకాణాల్లో లాక్ డౌన్ కు ముందు రూ. 12 కోట్ల మద్యం విక్రయాలు జరిగేవి. ఈ నెల 6వ తేదీన మద్యం విక్రయాలు ప్రారంభమైన తర్వాత జంటనగరాల పరిధిలో మద్యం దుకాణాల్లో కనీసం రూ. 6 కోట్లకు మించి కూడ మద్యం విక్రయాలు సాగడం లేదు.
undefined
లాక్ డౌన్ కు ముందు రోజు వరకు ప్రతి రోజూ కనీసం ఒక్కో దుకాణంలో కనీసం రూ. 3 లక్షల విక్రయాలు జరిగేవి. కానీ, ఇప్పుడు రూ. 1.5 లక్షల విలువైన మద్యం విక్రయాలు మాత్రమే సాగుతున్నాయి.
undefined
మద్యం దుకాణాలను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకే తెరిచి ఉంచుతున్నారు. వైన్స్ దుకాణాల పక్కన ఉన్న పర్మిట్ రూమ్ లను ప్రభుత్వం అనుమతించలేదు.
undefined
సాయంత్రం పూట వైన్స్ దుకాణాలు మూసి ఉంచడం కూడ కారణంగా వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల్లో కోత కారణంగా కూడ మద్యం విక్రయాలపై పడినట్టుగా వ్యాపారులు చెబుతున్నారు.
undefined
ఈ నెల 6వ తేదీన తెలంగాణలో మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. మద్యం విక్రయాలు ప్రారంభమైన రోజున రాష్ట్ర వ్యాప్తంగా రూ. 72.5 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.
undefined
click me!