ఇప్పటికే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి ఈ పనిలో బిజీగా ఉన్నారు. 29వ తేదీన అమిత్ షా పర్యటన సందర్భంగా లాయర్, ఇంజనీర్స్, డాక్టర్స్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. అంతే కాకుండా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వారు రూం ఏర్పాటుకు కూడా కసరత్తులు ప్రారంభించినట్లు సమాచారం.