కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ కాంగ్రెస్ పార్టీ ప్రచార హోరు కూడా పెరుగుతోంది. తాజాగా ఆ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఇల్లంతకుంట మండల పరిధిలోని మర్రివానిపల్లి, సీతంపేట గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భారీగా కాంగ్రెస్ శ్రేణులు వెంటరాగా ఓటర్లను ఆత్మీయంగా పలకరించి తనకు ఓటేయాలని వెంకట్ కోరారు.