గోల్డ్ ఏటిఎం ఎలా పనిచేస్తుంది :
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరంగల్ లో గోల్డ్ ఏటిఎం సేవలు ప్రారంభించింది. ఈ ఏటిఎం ను వినియోగదారులు గోల్డ్ లోన్ కోసం ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం గోల్డ్ లోన్ పొందాలంటే బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లాల్సి వస్తోంది...అంతేకాదు అక్కడ చాలా ప్రాసెస్ ఉంటుంది. కానీ ఈ ఏటిఎం ద్వారా క్షణాల్లో గోల్డ్ లోన్ పొందవచ్చు.
మీ దగ్గరున్న గోల్డ్ ఈ ఏటిఎంలో వేయగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో బరువు, నాణ్యతను నిర్దారిస్తుంది. ఈ బంగారానికి గోల్డ్ లోన్ ఎంత వస్తుందో సూచిస్తుంది. అది మీకు నచ్చితే వెంటనే మీ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ను ఎంటర్ చేసి అప్పటికప్పుడు డబ్బులు పొందవచ్చు.
ఇలా బ్యాంకుల చుట్టూ తిరిగి గోల్డ్ లోన్ పొందడంకంటే ఈ ఏటిఎం మిషన్ ద్వారా సులువుగా డబ్బులు పొందవచ్చు. ఎలాంటి పేపర్ వర్క్ అవసరం లేదు. సాంకేతికతను ఉపయోగించి లోన్ ను నిర్దారిస్తారు... ఎక్కడా మనిషి ప్రమేయం ఉండదు కాబట్టి ఎలాంటి అవకతవకలు ఉండవు. బంగారాన్ని ఎటిఎంలో వేసినవెంటనే లోన్ ఎంత వస్తుందో నిర్దారణ అవుతుంది... మీరు అంగీకరిస్తే 10 శాతం డబ్బులు ఈ మిషన్ నుండి అప్పటికప్పుడే పొందుతారు.., మిగతా డబ్బులు మీ అకౌంట్లో జమ అవుతాయి.
ప్రస్తుతం ఈ గోల్డ్ లోన్ ఏటిఎం కేవలం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకే అందుబాటులో ఉంటుందని మేనేజింగ్ డైరెక్టర్,సీఈవో ఎంవీ రావు తెలిపారు. వరంగల్ లో ప్రయోగాత్మకంగా ఈ గోల్డ్ లోన్ ఏటిఎంను ఏర్పాటుచేసామని...సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా వీటిని ఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు.