తప్పుడు కేసులు: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్

First Published May 22, 2019, 2:55 PM IST

 టీవీ9 కొత్త యాజమాన్యం తనపై తప్పుడు కేసులు బనాయించిందని  టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ఆరోపించారు. కొత్త యాజమాన్యం ఆదేశాలను పోలీసులు పాటిస్తున్నారని ఆయన విమర్శించారు.

టీవీ9లో చోటు చేసుకొన్న పరిణామాలను రవిప్రకాష్ ఆ వీడియోలో వివరించారు. 15 ఏళ్ల క్రితం టీవీ9ను నెలకొల్పిన సమయంలో శ్రీనిరాజు పెట్టుబడి పెట్టి తనకు సహకరించినట్టుగా రవిప్రకాష్ చెప్పారు. ఈ సంస్థ బాధ్యతలన్నీ కూడ తాను తీసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పెట్టుబడి పెట్టిన శ్రీనిరాజు తనకు మద్దతుగా నిలిచారని ఆయన గుర్తు చేశారు.
undefined
అనేక న్యూస్ చానెల్స్ నష్టాల్లో ఉన్న సమయంలో కూడ టీవీ9 లాభాల బాటలో నడిచిన విషయాన్ని రవిప్రకాష్ గుర్తు చేశారు. 15 ఏళ్లుగా సంస్థ చైర్మెన్, సీఈఓగా తాను కొనసాగినట్టుగా రవిప్రకాష్ వివరించారు.
undefined
బుధవారం నాడు రవిప్రకాష్ ఓ వీడియోను విడుదల చేశారు. పోలీసుల విచారణకు హాజరుకాకుండా రవిప్రకాష్ తప్పించుకు తిరుగుతున్నారు. మరో వైపు ఈ విషయమై మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడ రవిప్రకాష్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం నాడు హైకోర్టు విచారణ చేయనుంది.
undefined
శ్రీనిరాజు సంస్థ నుండి తప్పుకోవాలని భావించిన సమయంలో కొత్త పెట్టుబడి దారుల కోసం తాను ప్రయత్నిస్తున్న సమయంలో ప్రముఖ కాంట్రాక్టర్ మేఘ కృష్ణారెడ్డి ఏబీసీఎల్ సంస్థలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారని రవిప్రకాష్ చెప్పారు. తనతో పాటు మరో నలుగురు మిత్రులు ఈ సంస్థలో 20 శాతం చొప్పున పెట్టుబడి పెట్టనున్నారని వివరించినట్టుగా ఆయన తెలిపారు.
undefined
దీంతో కృష్ణారెడ్డిని తాను శ్రీనిరాజు వద్దకు తీసుకెళ్లినట్టుగా చెప్పారు. అయితే అదే సమయంలో కొత్తగా పెట్టుబడి పెట్టే యాజమాన్యం మెజార్టీ వాటాను కొనుగోలు చేయదని కూడ కృష్ణారెడ్డి తనకు చెప్పారని రవిప్రకాష్ చెప్పుకొచ్చారు.
undefined
కానీ, తనకు చెప్పినట్టుగా కాకుండా మెజారిటీ వాటాను జూపల్లి రామేశ్వరరావు కొనుగోలు చేశారని రవిప్రకాష్ ప్రకటించారు.ఏబీసీఎల్‌‌లో మైనార్టీ వాటా దారుడినైనా తనతో ఒప్పందం చేసుకొనేందుకు జూపల్లి రామేశ్వరరావు అంగీకరించలేదని రవిప్రకాష్ ఆరోపించారు.
undefined
ఏబీసీఎల్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన కొత్త యాజమాన్యం తనపై తప్పుడు కేసులు బనాయించిందని రవిప్రకాష్ ఆరోపించారు. సినీ నటుడు శివాజీతో తాను చేసుకొన్న ఒప్పందంపై కోర్టులో కేసు ఉందన్నారు. తనపై మూడు కేసులను నమోదు చేశారని రవి ప్రకాష్ ఆరోపణలు చేశారు. ఈ విషయమై పత్రికా స్వేచ్ఛ కోసం పోరాటం చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా రవిప్రకాష్ చెప్పారు. ఈ విషయంలో తనకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.
undefined
click me!