హుజూరాబాద్ బైపోల్: ఈటలకు ప్రజా దీవెన యాత్ర కలిసొచ్చేనా?

Published : Aug 10, 2021, 11:16 AM IST

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ కు ప్రజా దీవెన యాత్ర  ఏ మేరకు కలిసివస్తోందో అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. మోకాలికి శస్త్రచికిత్స జరిగిన తర్వాత కూడ ఈటల రాజేందర్ యాత్ర చేస్తున్నారు.

PREV
113
హుజూరాబాద్ బైపోల్: ఈటలకు  ప్రజా దీవెన యాత్ర కలిసొచ్చేనా?

etela

: మోకాలికి శస్త్రచికిత్స తర్వాత మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. 2009 నుండి ఈ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఈటల రాజేందర్ వరుస విజయాలు సాధించారు.

213


టీఆర్ఎస్, బీజేపీలు ఇంకా అభ్యర్ధులను ప్రకటించలేదు. గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి. 


ఇటీవల కాలంలో చోటు చేసుకొన్న  రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరడానికి ముందే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
 

313

kcr

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలను పురస్కరించుకొని టీఆర్ఎస్ సర్కార్ దళితబంధు పథకాన్ని తెరమీదికి తీసుకొచ్చింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 2.10 లక్షల మంది ఓటర్లలో సుమారు 40 నుండి 45 వేల మంది దళిత సామాజికవర్గం ఓటర్లున్నారు. ఈ ఓట్లను గంపగుత్తగా తమ వైపునకు తిప్పుకొనేందుకు  టీఆర్ఎస్ ఈ పథకాన్ని తీసుకొచ్చిందని విపక్షాలు టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి.

413

BJP Flag

టీఆర్ఎస్ తీసుకొస్తున్న ఈ పథకాలకు ఈటల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్ దెబ్బకొట్టే అవకాశం ఉందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. 

513

kcr

హుజూరాబాద్ ఉప ఎన్నికలను పురస్కరించుకొని ఈటల రాజేందర్ ప్రజా దీవెన యాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర మధ్యలో ఆయన మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. 

613

etela rajender

ఈ శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఆసుపత్రి నుండి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడ ఈటల రాజేందర్ యాత్రను కొనసాగిస్తున్నారు.  మోకాలికి శస్త్రచికిత్స  జరిగినందున పాదయాత్రను నిలిపివేయాలని  వైద్యులు సూచించారు. కానీ ఈటల రాజేందర్ మాత్రం యాత్రను కొనసాగిస్తున్నాడు.

713

etela rajender

ఈ శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఆసుపత్రి నుండి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడ ఈటల రాజేందర్ యాత్రను కొనసాగిస్తున్నారు.  మోకాలికి శస్త్రచికిత్స  జరిగినందున పాదయాత్రను నిలిపివేయాలని  వైద్యులు సూచించారు. కానీ ఈటల రాజేందర్ మాత్రం యాత్రను కొనసాగిస్తున్నాడు.

813
etela

జమ్మికుంట టౌన్ నుండి ఈటల రాజేందర్  ప్రతి రోజూ రాత్రనక పగలనక ప్రజలను కలుస్తున్నారు. ఈటల రాజేందర్ ఇప్పటివరకు 220 కి.మీ యాత్ర సాగించారు. సుమారు 77 గ్రామాల్లోని ప్రజలను కలుసుకొన్నారు.

913

kcr

ఈ నెల 16వ తేదీ నుండి దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నుండి ప్రారంభించాలని టీఆర్ఎస్ సర్కార్ తలపెట్టింది. ఓట్ల కోసమే ఈ పథకాన్ని కేసీఆర్ తీసుకొచ్చారని  ఈటల రాజేందర్ విమర్శించారు.

1013

ఈటలతో ఉన్న కొందరు సన్నిహితులు కూడ ఆయనను విడిచి టీఆర్ఎస్‌లో చేరారు. అయినా కూడ ఆయన ప్రజలను నమ్ముకొని యాత్ర సాగిస్తున్నారు. ద్వితీయశ్రేణి నాయకత్వంపై ఆధారపడకుండా నేరుగా ప్రజలను కలవాలని ఈటల రాజేందర్ భావిస్తున్నారు.

1113

harishrao

ఈటల రాజేందర్ కు కౌంటర్ గా రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన  కీలక నేతలను టీఆర్ఎస్ లో చేర్పించడంలో హరీష్ కీలకపాత్ర పోషిస్తున్నారు. 

1213

షర్మిల మూలాలను కూడా ప్రశ్నిస్తున్నారు. ఆంధ్ర మూలాలు ఉన్న షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఆ విషయంపై ధాటిగానే వ్యాఖ్యలు చేశారు. జగన్ వదిలిన బాణం ఇప్పుడు వస్తుందని, ఆ తర్వాత జగన్, చంద్రబాబు వస్తారని ఆయన అన్నారు. వరుసగా షర్మిలపై ఆ విధమైన వ్యాఖ్యలు చేసిన గంగుల కమలాకర్ ఆ తర్వాత మౌనం వహించారు. ఆయన షర్మిలపై మౌనం వహించడానికి కారణమేమిటనేది స్పష్టంగా తెలియడం లేదు. 

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుతీరుతో పాటు ఈటల రాజేందర్ ప్రచారానికి కౌంటర్ వ్యూహాన్ని రచిస్తున్నారు. జిల్లాకు చెందిన మరో ఇద్దరు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లు కూడ  హుజూరాబాద్ నియోజకవర్గంపై కేంద్రీకరించారు.

1313

etela


అధికార పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ఈటల రాజేందర్ ప్రజాదీవెన యాత్ర ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.  అయితే ఈ యాత్ర ఏ మేరకు ఈటలకు కలిసివస్తోందనేది రానున్న రోజుల్లో తేలనుంది.

click me!

Recommended Stories