దుబ్బాక బీజేపీలో కలకలం: రఘునందన్ రావుకు కమలాకర్ రెడ్డి సెగ

First Published Oct 7, 2020, 2:25 PM IST

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు బీజేపీ టికెట్టు దక్కించుకొన్నాడు. అయితే పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం అభ్యర్ధిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. 

దుబ్బాక అసెంబ్లీ స్థానం లో బీజేపీ అభ్యర్థికి తలనొప్పులు ప్రారంభమయ్యాయి. మరొకరికి టికెట్టు ఇవ్వాలని ఇదే నియోజకవర్గానికి చెందిన కమలం పార్టీ నేత డిమాండ్ చేయడం కలకలం రేపుతోంది.
undefined
దుబ్బాక నుండి పోటీ చేసే అభ్యర్ధిని బీజేపీ ప్రకటించింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రఘునందన్ రావుకే బీజేపీ టికెట్టు ఇచ్చింది. దుబ్బాకలో రఘునందరావుకు టికెట్టు కేటాయించడాన్ని మరో నేత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అభ్యర్ధిని మార్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
undefined
ఈ ఏడాది ఆగష్టు 5వ తేదీన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో ఈ స్థానానికి ఈ ఏడాది నవంబర్ 3 వతేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత బరిలోకి దిగారు.
undefined
బీజేపీ అభ్యర్ధిగా రఘునందన్ రావు పేరును ఆ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్ధిగా టీఆర్ఎస్ నుండి నిన్ననే కాంగ్రెస్ లో చేరిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.
undefined
దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున కొంత కాలంగా రఘునందన్ రావు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఇవాళే దుబ్బాకలో పోటీ చేసే అభ్యర్ధిని బీజేపీ అధికారికంగా ప్రకటించింది.రఘునందన్ రావుకు టికెట్టు ఇవ్వడాన్ని బీజేపీ నేత తోట కమలాకర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దుబ్బాకలో అభ్యర్ధిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
undefined
ఈ విషయమై బుధవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. భారతీయ కిసాన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కమలాకర్ రెడ్డి కొనసాగుతున్నారు.రఘునందన్ రావు తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో టీఆర్ఎస్ లో ఉన్నారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు.
undefined
ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ లు కూడ ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని ఈ రెండు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. మరో వైపు ఈ ఎన్నికల్లో విజయం తమదేనని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. పార్టీ నేతల సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
undefined
click me!