హుజూరాబాద్ బైపోల్: టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ కౌంటర్, దళితబంధుకు చెక్

First Published Aug 5, 2021, 9:43 AM IST


హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  దళిత సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధిని బరిలోకి దింపాలని  యోచిస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్‌లు బీసీ సామాజిక వర్గం అభ్యర్ధిని బరిలోకి దింపితే దళిత సామాజికవర్గం అభ్యర్ధిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది.

రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వలసల్లో మరింత వేగం పెంచాలని ఆ పార్టీ భావిస్తోంది.కాంగ్రెస్ ను బలహీనపరిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తాము ప్రధాన ప్రత్యర్ధిగా మారే అవకాశం ఉంటుందని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బరిలో దింపే అభ్యర్ధి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. టీఆర్ఎస్, బీజేపీలు బీసీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధులను బరిలోకి దింపే అవకాశం ఉంది.  మరోవైపు కాంగ్రెస్ పార్టీ దళిత సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని బరిలోకి దింపాలని యోచిస్తోంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పనిచేసిన నేతకు జహీరాబాద్ ఎంపీ సీటును ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చిందని చెబుతున్నారు. అయితే గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన అసెంబ్లీ సీటు ఇవ్వాలని ఆయన బీజేపీని కోరినట్టుగా ప్రచారం సాగుతోంది. గతంలో కూడ ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగారు.ప్రస్తుత ప్రచారం కూడ అలాంటిదినేనా.. కాదా అనేది కాలమే నిర్ణయించాలి.

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నేతలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం నాడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఛైర్మెన్ దామోదర రాజనర్సింహ్మ సహ ఇతర ముఖ్యులు కూడ సమావేశంలో పాల్గొన్నారు.

huzurabad

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 2.10 లక్షల ఓటర్లున్నారు. ఇందులో బీసీ సామాజిక వర్గం ఓటర్ల తర్వాత దళిత సామాజికవర్గానికి చెందినవారు సుమారు 40 వేలకు పైగా ఉంటారని అంచనా.

Congress BJP

దళిత సామాజికవర్గం ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు గాను టీఆర్ఎస్  ప్రభుత్వం దళితబంధు అంశాన్ని తెరమీదికి తెచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

kcr

 ఈ పథకాన్ని  హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పైలెట్  ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.ఈ నెల 16వ తేదీన ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టేందుకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల నేతలకు ఆయన స్వయంగా దిశా నిర్ధేశం చేస్తున్నారు.సీఎం కేసీఆర్ నేరుగా ఎన్నికల ప్రచారం చేయడం ఎన్నికలకు టీఆర్ఎస్ ఇస్తున్న ప్రాధాన్యతను తెలుపుతోంది.

హుజూరాబాద్‌లోనే ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేయడాన్ని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఎన్నికల్లో లబ్దిపొందేందుకే కేసీఆర్ సర్కార్ ఈ స్కీమ్ ను తీసుకొచ్చిందని విమర్శిస్తున్నాయి. 

BJP Congress

ఈ తరుణంలో దళిత సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధిని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బరిలోకి దింపాలని తెలంగాణ కాంగ్రెస్  నాయకత్వం భావిస్తోంది. బుధవారం నాడు జిల్లాకు చెందిన నేతల సమావేశంలో ఈ అంశంపై చర్చించారు.


దళిత సామాజికవర్గం ఓటర్లపై టీఆర్ఎస్ దళితబంధు పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. అయితే ఈ తరుణంలో దళిత సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధిని బరిలోకి దింపడం ద్వారా రాజకీయంగా టీఆర్ఎస్‌పై పైచేయి సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పనిచేసిన నేతకు జహీరాబాద్ ఎంపీ సీటును ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చిందని చెబుతున్నారు. అయితే గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన అసెంబ్లీ సీటు ఇవ్వాలని ఆయన బీజేపీని కోరినట్టుగా ప్రచారం సాగుతోంది. గతంలో కూడ ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగారు.ప్రస్తుత ప్రచారం కూడ అలాంటిదినేనా.. కాదా అనేది కాలమే నిర్ణయించాలి.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉండే అభ్యర్ధి కోసం  ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మెన్ దామోదర రాజనర్సింహ్మ నేతృత్వంలోని కమిటీ నియోజకవర్గంలో అభ్యర్ధి ఎంపిక కోసం  కసరత్తు చేయనుంది.  ఇటీవలనే నియోజకవర్గంలో రాజనర్సింహ పర్యటించారు. స్థానిక నేతలతో చర్చించారు.

click me!