కృష్ణా, గోదావరి నదులకు భారీ వరద: సముద్రంలోకి 4300 టీఎంసీల నీరు విడుదల

First Published Oct 21, 2020, 12:03 PM IST

కృష్ణా, గోదావరి నదులకు ఈ ఏడాది భారీగా వరదలు వచ్చాయి. సకాలంలో వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున వరద నీరు సముద్రంలో కలిసింది. 

కృష్ణా, గోదావరి నదుల నుండి ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 4300 టీఎంసీల నీరు సముద్రంలోకి విడుదల చేశారు.ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ప్రారంభమైన నాటికి సుమారు 800 టీఎంసీల నీరు ప్రకాశం బ్యారేజీ నుండి సముద్రంలో కలిసింది. గోదావరి నది నుండి సుమారు 3500 టీఎంసీల నీరు దవళేశ్వరం బ్యారేజీ నుండి సముద్రంలోకి వెళ్లింది.
undefined
నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయి.. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాక కూడ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదైంది.మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడ భారీవర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున దిగువకు నీరు వచ్చి చేరుతోంది.
undefined
కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి, నారాయణపూర్, ఏపీలోని శ్రీశైలం, తెలంగాణలో నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు కృష్ణా నుండి భారీగా వరద నీరు వచ్చి చేరింది. గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోని వ్యవసాయ అవసరాలతో పాటు వచ్చే 12 నుండి 18 నెలల పాటు ఈ నీటి నిల్వలు పనికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
undefined
కర్ణాటకలోని ఆల్మట్టి నుండి, నారాయణపూర్ నుండి తెలంగాణలోని జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇవాళ జూరాలకు 4.26 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది.
undefined
శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రతిరోజూ 5.68 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. మరో వైపు శ్రీశైలం నుండి 5.30 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న సాగర్ కు విడుదల చేస్తున్నారు.
undefined
శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు, ప్రస్తుతం 884.4 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో 212 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి 4.67 లక్షల క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
undefined
ఇక గోదావరి నదిపై నిర్మించిన జైక్వాడ్, కడెం, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో కూడ ఇదే రకమైన పరిస్థితులు ఉన్నాయని అధికారులు తెలిపారు.
undefined
click me!