బంగాళాఖాతంలో అల్పపీడనం...
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అయితే అల్లూరి జిల్లాలోని జేకేవీధి, ముంచింగిపుట్టు, పెదబయ... పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, గుర్తేడు మండలాల్లో ఈదురు గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది.
ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేటికీ అదే ప్రాంతంలో కొనసాగుతోందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతోనే ప్రస్తుతం ఏపీలో వర్షాలు కురుస్తున్నాయని... దీని ప్రయాణాన్ని బట్టి వర్షాలు పెరుగుతాయో, తగ్గుతాయో తేలనుందని పేర్కొన్నారు.