మైక్రోమ్యాక్స్ 2020-21లో గొప్ప పునరాగమనం చేస్తూ చాలా స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది, లావా మొదటి 5జి ఫోన్ను పరిచయం చేసింది. మరోవైపు మైక్రోమ్యాక్స్ అండ్ లావా వంటి కంపెనీలు కూడా ఇయర్బడ్లను ప్రవేశపెట్టాయి.
భారతదేశంలో వెరబుల్ వస్తువుల మార్కెట్ సంవత్సరానికి 118% చొప్పున పెరుగుతోంది. ఈ గణాంకాలు 2021 సంవత్సరం రెండవ త్రైమాసికానికి సంబంధించినవి. ఇక్కడ అతిపెద్ద విషయం ఏమిటంటే దేశీయ కంపెనీలు వెరబుల్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. భారతదేశంలో స్మార్ట్ వాచ్ మార్కెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఫైర్ ఫోల్ట్ (Fire-Boltt), బోట్ (BoAt), నాయిస్ (Crossbeats) వంటి దేశీయ కంపెనీలు అమేజ్ ఫిట్, రెడ్ మీ, రియల్ మీ వంటి కంపెనీలను అధిగమించాయి.