ఈ యాప్ ఇన్వెస్టర్లకు ఎంతో మేలు చేస్తుందని ఆయన తెలిపారు. రానున్న కాలంలో ఈ మొబైల్ యాప్ పెట్టుబడిదారులకు ముఖ్యంగా యువతలో ఆదరణ పొందుతుందని అజయ్ త్యాగి అన్నారు.
సెబి వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ యాప్ ద్వారా పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ అస్థిరత, సెక్యూరిటీల మార్కెట్, కేవైసి (know your customer)ప్రాసెస్, ట్రేడింగ్ అండ్ సెటిల్మెంట్, మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ గురించి ప్రతిది నిమిషం నుండి నిమిషం తెలుసుకుంటారు.