స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు బిగ్ గిఫ్ట్.. మొబైల్ యాప్‌ను ప్రారంభించిన సెబి.. ఎలా పనిచేస్తుందంటే..?

First Published Jan 20, 2022, 3:55 PM IST

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)భారీ బహుమతిని అందించింది.  స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిని మరింత సులభతరం చేయడానికి సెబి మొబైల్ యాప్‌ను ప్రారంభించింది.

ఈ యాప్ కి సారథి అని పేరు పెట్టినట్లు అలాగే పెట్టుబడిదారులకు సరైన మార్గం చూపేందుకు ఈ యాప్ కృషి చేస్తుందని తెలిపింది.  దీనికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారులకు అవగాహన కల్పించే మొబైల్ యాప్ "సారథి" లాంచ్ చేసినట్లు  సెబీ బోర్డు ఛైర్మన్ అజయ్ త్యాగి తెలిపారు . దీని ద్వారా పెట్టుబడిదారులు  ఆర్థిక సంబంధించిన చాలా ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు.

ఈ యాప్ ఇన్వెస్టర్లకు ఎంతో మేలు చేస్తుందని ఆయన తెలిపారు. రానున్న కాలంలో ఈ మొబైల్ యాప్ పెట్టుబడిదారులకు ముఖ్యంగా యువతలో ఆదరణ పొందుతుందని అజయ్ త్యాగి  అన్నారు.


సెబి వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ యాప్ ద్వారా పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్  అస్థిరత, సెక్యూరిటీల మార్కెట్, కే‌వై‌సి (know your customer)ప్రాసెస్, ట్రేడింగ్ అండ్ సెటిల్‌మెంట్, మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ గురించి ప్రతిది నిమిషం నుండి నిమిషం తెలుసుకుంటారు.

వార్తలు ఇంకా తాజా అప్ డేట్లు కూడా అందుబాటులో ఉంటాయి. దీంతో స్టాక్ మార్కెట్ లో హెచ్చు తగ్గుల గురించి పెట్టుబడిదారులకి అవగాహన ఉంటుంది. అలాగే  ఇన్వెస్టర్లు ఫిర్యాదుల పరిష్కారం వంటి ముఖ్యమైన సమాచారాన్ని పొందగలుగుతారు. స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించే వ్యక్తిగత పెట్టుబడిదారులు సంబంధిత సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయడానికి యాప్ సహాయపడుతుందని అజయ్ త్యాగి చెప్పారు.

హిందీ అండ్ ఆంగ్ల భాషలలో  
"సారథి" యాప్ హిందీ ఇంకా ఆంగ్ల భాషలలో అందుబాటులో ఉంటుంది. అలాగే ఆండ్రాయిడ్ ఇంకా ఐ‌ఓ‌ఎస్ స్మార్ట్‌ఫోన్‌లలో సులభంగా ఉపయోగించవచ్చు. దీన్ని ప్లే స్టోర్ ఇంకా ఆపిల్ యాప్ స్టోర్ రెండింటి నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తన ప్రసంగంలో యాప్‌ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ, ప్రాంతీయ భాషల్లో వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

click me!