వాట్సాప్, టెలిగ్రామ్ కి పోటీగా ట్విట్టర్ టిప్ జార్ ఫీచర్.. ఇప్పుడు మరింత ఈజీగా డబ్బు పంపవచ్చు..

First Published May 8, 2021, 11:27 AM IST

ఇప్పటి వరకు మీరు ఫేస్ బుక్ మెసెంజర్, వాట్సాప్, టెలిగ్రామ్ నుండి డబ్బు పంపేందుకు అవకాశం ఉంది, కానీ ఇప్పుడు మీరు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా కూడా డబ్బు పంపవచ్చు. 

ట్విట్టర్ టిప్ జార్ పేరిట ఈ పేమెంట్ ఫీచర్ ను విడుదల చేసింది. పేపాల్, పాట్రియన్, వెన్మో మొదలైన డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లు పనిచేసే విధంగానే ట్విట్టర్ 'టిప్ జార్' పని చేస్తుందని తెలిపింది. ఏ‌ఎఫ్‌పి నివేదిక ప్రకారం, ట్విట్టర్ టిప్ జార్ ఫీచర్ ప్రస్తుతం సెలెక్ట్ చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.
undefined
ప్రస్తుతం, ఇంగ్లీషులో ట్వీట్ చేసిన వినియోగదారులు మాత్రమే ఈ ఫీచర్ ఉపయోగించగలరు. వినియోగదారులు ఈ ఫీచర్ ని వారి ప్రొఫైల్‌కు జోడించవచ్చు, ఆ తర్వాత ఇతర వినియోగదారులు వారికి డబ్బు పంపగలరు. ఈ ఫీచర్ ప్రస్తుతం జర్నలిస్టులు, వ్యక్తిగత కేసు నిపుణులు, క్రియేటర్స్, లాభాపేక్షలేనివారికి విడుదల చేయబడింది.
undefined
ఈ పేమెంట్ల కోసం ఎటువంటి కమీషన్ వసూలు చేయబోమని ట్విట్టర్ స్పష్టంగా పేర్కొంది. ట్విట్టర్ టిప్ జార్ ఫీచర్ త్వరలో అందరికీ విడుదల కానుంది, కాని సంస్థ అధికారిక తేదీని నిర్ణయించలేదు.
undefined
మొదటి త్రైమాసికంలో ట్విట్టర్ ఊహించినంత లాభాలని ఆర్జించలేదని గత వారం ఒక నివేదిక వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త ఫీచర్‌ కారణంగా ఎక్కువ మంది ట్విట్టర్‌తో కనెక్ట్ అవుతారని భావిస్తున్నారు.
undefined
click me!