చంద్రుడిపై కాలు మోపిన నాలుగో దేశంగా, చంద్రుడి దక్షిణ ధ్రువంపై స్పెస్ క్రాఫ్ట్ ల్యాండ్ చేసి అన్వేషించిన తొలి దేశంగా కూడా భారత్ ఘనత సాధించింది.
ప్రస్తుతం భారత శాస్త్రవేత్తలను రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సహా పలు దేశాల నేతలు అభినందనలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ రేపు గ్రీస్ వెళ్లనున్నారు.