ఆన్ లిమిటెడ్ వాయిస్ ప్లాన్లలో ఎయిర్టెల్ దాదాపు 11 శాతం టారిఫ్ ధరలను పెంచింది, అంటే టారిఫ్ ధరలను రూ.179 నుండి రూ.199కి సవరించింది. రూ.455 ప్లాన్ ధరను రూ.509కి, రూ.1,799 ప్లాన్ ధరను రూ.1,999కి పెంచేసింది. డైలీ డేటా ప్లాన్ విభాగంలో 56 రోజుల వ్యాలిడిటీ, 1.5 GB/dayగల రూ.479 ప్లాన్ రూ.579కి (20.8 శాతం పెంపు) పెరిగింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ జూలై 3 నుండి మొబైల్ సర్వీస్ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించడం గమనార్హం.