ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్: స్మార్ట్ ఫోన్స్ పై అందిస్తున్న బెస్ట్ ఆఫర్‌లు, డిస్కౌంట్లు ఇవే..

First Published Oct 4, 2021, 1:55 PM IST

దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లాట్ ఫార్మ్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. అయితే ఈ రెండు ఈ ఇ-కామర్స్ కంపెనీలు ఫెస్టివల్ సేల్ ఒకేసారి ప్రారంభించడం ఇదే మొదటిసారి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లోని ఈ సేల్ అక్టోబర్ 10 వరకు కొనసాగుతుంది. 

 ఈ సేల్ లో ఎలక్ట్రానిక్స్ నుండి కిచెన్, ఫ్యాషన్ వరకు ఉన్న ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందిస్తుంది. అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మొబైల్స్ అత్యంత ట్రెండింగ్ సెర్చ్‌లో ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్ లో ప్రజలు ఎక్కువగా మొబైల్స్ కొనడానికి వెయిట్ చేస్తున్నారు. ఈ రెండు ఈ కామర్స్ సైట్లలో మొబైల్స్ పై లభించే కొన్ని గొప్ప ఆఫర్ల గురించి తెలుసుకుందాం ...

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మొబైల్ ఆఫర్లు

పోకో ఎక్స్ 3 ప్రో, పోకో ఎం 2 ప్రో, పోకో ఎఫ్ 3 జిటి, పోకో సి31 పై రూ .2,000 వరకు తగ్గింపు అందిస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌లపై  బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సెల్‌లో 6జి‌బి ర్యామ్ 128 జి‌బి స్టోరేజ్ వేరియంట్ పోకో ఎక్స్3 ప్రోని రూ .16,999కే అంటే రూ .2,000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఇతర మోడళ్లపై కూడా అతితక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇటీవల లాంచ్ చేసిన పోకో సి31పై రూ .500 తగ్గింపు ఇస్తుంది. పోకో కాకుండా ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5ఏ ని రూ .7,999 కి బదులుగా  ఇప్పుడు రూ .5,849 కి కొనుగోలు చేయవచ్చు.  ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5ని కూడా చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఒపో ఏ12 ధర రూ. 10,990 అయితే ఈ సేల్ లో దీనిని రూ .7,191కి కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ సేల్ లో మొబైల్ ఆఫర్లు

అమెజాన్ సేల్ లో ఐఫోన్ 11 ఇప్పుడు కేవలం రూ .38,999 కి లభిస్తుంది. ఈ ధర వద్ద 64 జి‌బి వేరియంట్ పొందవచ్చు. దీనితో పాటు రూ .15,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఐఫోన్ కాకుండా స్యామ్సంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్‌ఈ 5జి రూ .36,990కే అందిస్తున్నారు, అయితే దీని ఎం‌ఆర్‌పి ధర రూ .74,999. ఈ శామ్‌సంగ్ ఫోన్‌ పై రూ.15వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో ఐఫోన్ ఎక్స్‌ఆర్ ధర రూ .32,999, శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 20 ధర రూ. 44,990, ఐకూ జెడ్3 5జి ధర  రూ .17,990, రెడ్‌మి నోట్ 10 ప్రో ధర రూ .16,499కి కొనుగోలు చేయవచ్చు.

click me!